Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ అసెంబ్లీ సమరం : బాపట్లలో ముగ్గురు జనసేన అభ్యర్థులు..

Webdunia
మంగళవారం, 26 మార్చి 2019 (12:47 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా, చిత్రవిచిత్ర సంఘటనలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ముక్కోణపు పోటీ నెలకొంది. ప్రధానంగా నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తయింది. ఈనెల 28వ తేదీన పోటీలో ఉండే అభ్యర్థుల పేర్లను ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించనుంది. 
 
ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా బాపట్ల అసెంబ్లీ స్థానంలో జనసేన పార్టీ తరపున ముగ్గురు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. దీంతో ఓటర్లు గందరగోళానికి గురవుతున్నరు. ఈ నియోజకవర్గంలో ఎవరికి మద్దతు ఇవ్వాలనే విషయమై కార్యకర్తలు తికమక పడుతున్నారు.
 
ఈ స్థానంలో తొలుత పార్టీ నుంచి బీ-ఫారం అందుకున్న రైల్వే కాంట్రాక్టర్ పులుగు మధుసూదన్‌ రెడ్డి తొలుత నామినేషన్ దాఖలు చేశారు. అయితే, ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో సీబీఐ మాజీ జేడీ వివి. లక్ష్మీనారాయణ సన్నిహితుడు ఇక్కుర్తి లక్ష్మీనరసింహకు టికెట్ ఇచ్చి మధుసూదన్‌రెడ్డి బీ-ఫారంను జనసేన రద్దు చేసింది. దీంతో సోమవారం లక్ష్మీనరసింహ నామినేషన్ వేశారు.
 
అయితే, పార్టీ నుంచి బీ-ఫారం లేకపోయినప్పటికీ తానే అభ్యర్థినంటూ ఆ పార్టీకి చెందిన మరో నేత బీకే నాయుడు కూడా ఇక్కడి నుంచి నామినేషన్ వేశారు. ఇలా ఒకే పార్టీకి చెందిన ముగ్గురు నేతలు బరిలో ఉండటంతో జనసేన శ్రేణులు ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకుంటున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments