Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్... నిన్ను కేంద్రంతో కలిసి ఓ ఆటాడుకుంటా : పవన్ కళ్యాణ్ హెచ్చరిక

Webdunia
గురువారం, 10 ఆగస్టు 2023 (22:18 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ జగదాంబ సెంటర్ వేదిక నుంచి గట్టి హెచ్చరిక చేశారు. జగన్.. గుర్తుంచుకో.. కేంద్రంతో నిన్ను ఓ ఆట ఆడించకపోతే చూడు.. నీ నేతల అక్రమాల చిట్టా కేంద్రానికి ఇస్తాను. అపుడు ఏం జరుగుతుందో చూడు అంటూ ఘాటు హెచ్చరికలు చేశారు.
 
వారాహి మూడో దశ యాత్రలోభాగంగా, ఆయన గురువారం విశాఖలో ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. జగన్‌ను ఓ దోపిడీ దొంగతో పోల్చారు. మీరు ఎన్నుకున్నది దోపిడీలు చేసుకునే వ్యక్తిని. ఇలాంటి వాళ్ళను ఐదేళ్ళు బరించలేరు అని అందుకే గత ఎన్నికల్లో వైకాపాని గెలిపించవద్దని చెప్పారు. 
 
జగన్ ముఠా తెలంగాణా ప్రాంతాన్ని కూడా దోచుకుంటే అక్కడి వారు తన్ని తరిమేశారు. విశాఖలో రుషికొండను తవ్వేశారు. తుఫానుల నుంచి కాపాడే కొండను చెక్కేశారు. ఎర్రమట్టి దిబ్బలను దోచేస్తున్నారు. వైకాపా దోపిడీని అడ్డుకోలేరా, వచ్చే ఎన్నికల్లో మాకు ఓటేయండి.. ఒక్కసారి జనసేనకు అండగా నిలబడండి. మీ కోసం నేను నిలబడతా అంటూ ఆయన విశాఖ వాసులకు విజ్ఞప్తి చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

రజనీకాంత్‌కు వీరాభిమానిని - అలా చేయడం ఇబ్బందిగా లేదు : అమీర్ ఖాన్

రామ్ పోతినేని తన ప్రేయసికి అనుభవంలోంచి నువ్వుంటే చాలే.. గీతం రాశారా !

వివాహ వ్యవస్థపై నాకు పెద్దగా నమ్మకం లేదు : కంగనా రనౌత్

'విశ్వంభర' చిత్రం ఆలస్యాని కారణం సముచితమే : చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments