Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్... నిన్ను కేంద్రంతో కలిసి ఓ ఆటాడుకుంటా : పవన్ కళ్యాణ్ హెచ్చరిక

Webdunia
గురువారం, 10 ఆగస్టు 2023 (22:18 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ జగదాంబ సెంటర్ వేదిక నుంచి గట్టి హెచ్చరిక చేశారు. జగన్.. గుర్తుంచుకో.. కేంద్రంతో నిన్ను ఓ ఆట ఆడించకపోతే చూడు.. నీ నేతల అక్రమాల చిట్టా కేంద్రానికి ఇస్తాను. అపుడు ఏం జరుగుతుందో చూడు అంటూ ఘాటు హెచ్చరికలు చేశారు.
 
వారాహి మూడో దశ యాత్రలోభాగంగా, ఆయన గురువారం విశాఖలో ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. జగన్‌ను ఓ దోపిడీ దొంగతో పోల్చారు. మీరు ఎన్నుకున్నది దోపిడీలు చేసుకునే వ్యక్తిని. ఇలాంటి వాళ్ళను ఐదేళ్ళు బరించలేరు అని అందుకే గత ఎన్నికల్లో వైకాపాని గెలిపించవద్దని చెప్పారు. 
 
జగన్ ముఠా తెలంగాణా ప్రాంతాన్ని కూడా దోచుకుంటే అక్కడి వారు తన్ని తరిమేశారు. విశాఖలో రుషికొండను తవ్వేశారు. తుఫానుల నుంచి కాపాడే కొండను చెక్కేశారు. ఎర్రమట్టి దిబ్బలను దోచేస్తున్నారు. వైకాపా దోపిడీని అడ్డుకోలేరా, వచ్చే ఎన్నికల్లో మాకు ఓటేయండి.. ఒక్కసారి జనసేనకు అండగా నిలబడండి. మీ కోసం నేను నిలబడతా అంటూ ఆయన విశాఖ వాసులకు విజ్ఞప్తి చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భయపెట్టబోతున్న అప్సరా రాణి.. రాచరికం - పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో షురూ

సూప‌ర్ నేచుర‌ల్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌ కథతో సుధీర్ బాబు నూతన చిత్రం

నటి గా అవకాశాలు కోసం ఆచితూచి అడుగులేస్తున్న శివానీ రాజశేఖర్

శ్రీరామ్ హీరోగా క్రైమ్ థ్రిల్లర్ కథతో కోడి బుర్ర ప్రారంభం

ఆసక్తిగా మోహ‌ర్ ర‌మేష్ విడుద‌ల చేసిన ది బ‌ర్త్‌డే బాయ్ టీజ‌ర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments