Webdunia - Bharat's app for daily news and videos

Install App

470 కేజీల వెండి గొలుసులతో పవన్ కళ్యాణ్ చిత్తరువు

Webdunia
గురువారం, 31 ఆగస్టు 2023 (16:32 IST)
పవర్ స్టార్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సెప్టెంబరు 2వ తేదీన తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకోనున్నారు. దీంతో ఆయన అభిమానులు తమకుతోచిన విధంగా పలు రకాలైన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులోభాగంగా, కొందరు వీరాభిమానులు కలిసి 470 కేజీల వెండితో తమ అభిమాన నేత చిత్తరువు తయారు చేశారు. దీనికి సంబంధించిన మేకింగ్ వీడియోను జనసేన పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ రిలీజ్ చేశారు. 
 
నెల్లూరు సిటీ జనసేన పార్టీ అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఆధ్వర్యంలో 470 కేజీల వెండితో పవన్ కళ్యాణ్ చిత్ర రూపాన్ని రూపొందించారు. వెండి గొలుసులు ఉపయోగించి ఈ కళాకృతిని తీర్చిదిద్దారు. దీనికి సంబంధించిన మేకింగ్ వీడియోను జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి, జనసేన నేతలు, కొట్టే వెంకటేశ్వర్లు, సుదరరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జియో సినిమా ప్రీమియంలో ఈనెల‌ 15న కుంగ్ ఫూ పాండా 4

డ్రగ్స్ - సైబర్ నేరాల అరికట్టేందుకు ప్రయత్నం : నిర్మాత దిల్ రాజు

ఆయన సినిమాలో పార్ట్ కావడం నా కల : హీరోయిన్ మాల్వి మల్హోత్రా

శ్రీకృష్ణుడి గొప్పతనం అంశాలతో తెరకెక్కిన ‘అరి’ విడుదలకు సిద్ధం

గీతా ఆర్ట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments