Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమిత్ షా గారూ.. మా విశాఖను కబ్జాకోరుల నుంచి రక్షించండి...

Webdunia
ఆదివారం, 18 జూన్ 2023 (15:18 IST)
కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు జన జాగరణ సమితి నిర్వాహకులు ఓ విజ్ఞప్తి చేశారు. కబ్జాకోరుల నుంచి మా విశాఖపట్టణాన్ని రక్షించాలంటూ వైజాగ్ వ్యాప్తంగా గోడలకు పోస్టర్లు అంటించారు. నగరంలో భూకబ్జాలు, గనులు, ఇసుక దోపిడీ, గంజాయి మాఫియా, క్రికెట్ బెట్టింగులు, దోపిడీలు, చైన్ స్నాచింగ్‌లు పెరిగిపోతున్నాయంటూ అర్థమొచ్చేలా ఈ పోస్టర్లను ముద్రించి నగర వ్యాప్తంగా అంటించారు. ల్యాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, గంజా మాఫియా, క్రికెట్ బెట్టింగ్స్, మర్డర్లు, కిడ్నాప్‌లు ఇలా అన్నీ పెరిగిపోతున్నాయని, అందువల్ల వైజాగ్‌ను రక్షించాలంటూ జన జాగరణ సమితి విన్నవించింది.
 
ఇదేవిషయంపై ఆ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు మాట్లాడుతూ, ప్రశాంతతకు మారుపేరైన విశాఖలో భూములకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. భూకబ్జాలు, గంజాయి గురించిన వార్తలు తరచూ వింటుంటే చాలా బాధగా ఉందన్నారు. సాక్షాత్తూ విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యులను ఏకంగా కిడ్నాప్ చేసి రెండు రోజులపాటు నిర్బంధించడంతో ఆయన విచారం వ్యక్తం చేశారు. అరాచక శక్తులకు అడ్డాగా విశాఖ మారిందంటూ వ్యాఖ్యానించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా... ఇపుడు విశాఖను రక్షించాల్సిన బాధ్యత తీసుకోవాలని ఆయన కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anupama : దెయ్యంలా వుంటావని అమ్మ తిడుతుండేది : అనుపమ పరమేశ్వరన్

Ileana: నేను తల్లిని కాదని అనిపించిన సందర్భాలున్నాయి.. ఇలియానా

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

తర్వాతి కథనం
Show comments