Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ - సాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్లు : తీర్పు సెప్టెంబరు 15కు వాయిదా

Webdunia
బుధవారం, 25 ఆగస్టు 2021 (14:49 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిల బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సీబీఐ కోర్టు కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ పిటిషన్లపై బుధవారం తీర్పును వెలువరిస్తామని గత విచారణ సందర్భంగా ప్రకటించింది. కానీ, మరోమారు ఈ తీర్పును వాయిదావేసింది. తుది తీర్పును వచ్చే నెల 15న వెలువరిస్తామని తెలిపింది. 
 
జగన్, విజయసాయిరెడ్డి ఇద్దరి పిటిషన్లపై తీర్పును ఒకే రోజున వెలువరిస్తామని చెప్పింది. ఈ పిటిషన్లను వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లపై గత నెలాఖరులో వాదనలు ముగిశాయి. సీబీఐ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
 
సీఎం స్థాయిలో ఉన్న జగన్ తనకున్న అధికారాన్ని ఉపయోగించి బెయిల్ షరతులను ఉల్లంఘిస్తున్నారని తన పిటిషన్ లో రఘురాజు పేర్కొన్నారు. బెయిల్ రద్దు చేసి, విచారణను త్వరగా ముగించాలని కోర్టును ఆయన కోరారు. వివిధ కారణాలను చెపుతూ కోర్టుకు హాజరు కాకుండా డుమ్మా కొడుతున్నారని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments