ఏప్రిల్‌ 1న వైఎస్సార్‌ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలు ప్రారంభం

Webdunia
గురువారం, 31 మార్చి 2022 (13:25 IST)
ఏప్రిల్‌ 1న వైఎస్సార్‌ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10.30 గంటలకు విజయవాడ బెంజ్‌ సర్కిల్‌లో 500 వాహనాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రారంభించనున్నారు. 
 
గర్భిణులు, బాలింతలకు వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఉన్న వాహనాలకు అదనంగా 500 వాహనాలను సీఎం ప్రారంభించనున్నారు.
 
2016లో ప్రారంభమైన 'తల్లీబిడ్డ' ఎక్స్‌ప్రెస్‌ పథకం నిర్వహణ సంస్థ మూడేళ్ల కాలపరిమితి ఎప్పుడో ముగిసింది. మరో సంస్థను ఎంపిక చేయడంలో ఏళ్ల తరబడి జాప్యం జరిగింది. టెండరు ద్వారా కొత్తగా ఎంపిక చేసిన ఓ సంస్థ ఈ ఏడాది మార్చి నుంచి సేవలను కొనసాగించాల్సి ఉంది. 
 
ప్రస్తుతం వాడుకలో ఉన్న మారుతి వాహనాల ద్వారా కాకుండా స్పోర్ట్స్‌ యుటిలిటీ, మిడ్‌ లెవల్‌ యుటిలిటీ స్థాయి వాహనాల ద్వారా బాలింతలను పంపించాలని ప్రభుత్వం షరతు విధించింది. 
 
అయితే అర్హత సాధించిన సంస్థ చూపించిన వాహనాలు, వాటిలోని సౌకర్యాలు ప్రమాణాలకు తగ్గట్లు లేనందున అధికారులు అంగీకరించలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ గా కర్మణ్యే వాధికారస్తే చిత్రం

Rajinikanth: రజనీకాంత్ కు అదే ఆఖరి సినిమానా, రిటైర్ మెంట్ కారణమా?

Adivi Sesh: అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఉగాదికి ఫిక్స్

తల్లి చనిపోయినా తిరువీర్ చెప్పకుండా షూటింగ్‌లో చేశాడు : కరుణ కుమార్

ఓ.. చెలియా లోని నాకోసం ఆ వెన్నెల.. బాణీ ఎంతో హాయిగా ఉంది : జేడీ చక్రవర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments