Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉపాధ్యాయులకు ట్యాబ్స్ వినియోగం.. బాలికలకు ప్రత్యేక జూనియర్ కాలేజీలు

Webdunia
శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (20:25 IST)
తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖలో వివిధ కార్యక్రమాల అమలు, పురోగతిపై సీఎం చర్చించారు. ప్రాథమిక విద్యలో 100 శాతం మంది పిల్లలు బడిలోనే ఉన్నారని అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు. 
 
8వ తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఇచ్చిన ట్యాబ్‌ల వినియోగంపై సీఎం సమీక్షించారు. ఈ ఏడాది రెండో విడత ట్యాబ్‌లు ఇచ్చేందుకు సిద్ధం కావాలని సీఎం ఆదేశించారు. 
 
టోఫెల్ పరీక్షలకు విద్యార్థుల సన్నద్ధతపై సీఎం ఆరా తీశారు. వారంలో మూడు పీరియడ్‌ల చొప్పున మూడు రోజుల పాటు శిక్షణ ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. 
 
ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బడి పిల్లలకు అందించే ఆహారంపై ప్రత్యేక దృష్టి సారించి గతంలో ఎన్నడూ లేని విధంగా డబ్బులు ఖర్చు చేస్తున్నారన్నారు. నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడకూడదు. 
 
నాణ్యతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. చిన్నారులకు అందజేసే ఆహారాన్ని ప్రతిరోజూ పర్యవేక్షించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. 
 
ప్రతి మండలంలో బాలికల కోసం ఒకటి చొప్పున రెండు జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేసేందుకు సీఎం ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mrunal Thakur: ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతున్న మృణాల్ ఠాకూర్ పేరు.. ఎలాగంటే?

పగ, అసూయ, ప్రేమ కోణాలను చూపించే ప్రభుత్వం సారాయి దుకాణం

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 కొత్త సీజన్ : కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏంటవి?

Pawan: ఎన్టీఆర్, ఎంజీఆర్ ప్రేరణతో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించా: జ్యోతి కృష్ణ

సయారా తో ఆడియెన్స్ ఆషికి రోజుల్ని తలుచుకుంటున్నారు : మహేష్ భట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments