Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉపాధ్యాయులకు ట్యాబ్స్ వినియోగం.. బాలికలకు ప్రత్యేక జూనియర్ కాలేజీలు

Webdunia
శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (20:25 IST)
తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖలో వివిధ కార్యక్రమాల అమలు, పురోగతిపై సీఎం చర్చించారు. ప్రాథమిక విద్యలో 100 శాతం మంది పిల్లలు బడిలోనే ఉన్నారని అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు. 
 
8వ తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఇచ్చిన ట్యాబ్‌ల వినియోగంపై సీఎం సమీక్షించారు. ఈ ఏడాది రెండో విడత ట్యాబ్‌లు ఇచ్చేందుకు సిద్ధం కావాలని సీఎం ఆదేశించారు. 
 
టోఫెల్ పరీక్షలకు విద్యార్థుల సన్నద్ధతపై సీఎం ఆరా తీశారు. వారంలో మూడు పీరియడ్‌ల చొప్పున మూడు రోజుల పాటు శిక్షణ ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. 
 
ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బడి పిల్లలకు అందించే ఆహారంపై ప్రత్యేక దృష్టి సారించి గతంలో ఎన్నడూ లేని విధంగా డబ్బులు ఖర్చు చేస్తున్నారన్నారు. నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడకూడదు. 
 
నాణ్యతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. చిన్నారులకు అందజేసే ఆహారాన్ని ప్రతిరోజూ పర్యవేక్షించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. 
 
ప్రతి మండలంలో బాలికల కోసం ఒకటి చొప్పున రెండు జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేసేందుకు సీఎం ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments