Webdunia - Bharat's app for daily news and videos

Install App

మణిపూర్ మార్చురీల్లో మగ్గిపోతున్న మృతదేహాలు...

Webdunia
శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (20:11 IST)
ఈశాన్య భారత రాష్ట్రమైన మణిపూర్‌లో రెండు జాతుల మధ్య చెలరేగిన ఘర్షణల్లో దాదాపు 175 మంది వరకు చనిపోయారు. వీరిలో 96 మంది మృతుల మృతదేహాలు ఇంకా ఆస్పత్రుల్లోని మార్చురీల్లో మగ్గిపోతున్నాయి. ఈ విషయాన్ని మణిపూర్ రాష్ట్ర పోలీస్ విభాగం వెల్లడించింది. ఈ ఘర్షణల్లో 33 మంది ఆచూకీ కనిపించడం లేదని, మరో 1118 మంది గాయపడ్డారని పేర్కొన్నారు. చనిపోయిన 175 మందిలో 96 గుర్తుతెలియని మృతదేహాలు మార్చురీలోనే ఉన్నాయని పేర్కొంది. 
 
మే 3వ తేదీన తమను ఎస్టీల్లో చేర్చాలన్న మైతేయ్‌ల డిమాండ్‌కు వ్యతిరేకంగా కుకీలు ఆందోళన చేపట్టడంతో హింసాకాండ మొదలైంది. కొన్నినెలలపాటు అది కొనసాగింది. సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తోన్న ప్రయత్నాలతో ప్రస్తుతం ఘర్షణలు కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. 
 
ఈ క్రమంలోనే రాష్ట్రం గణాంకాలను విడుదల చేసింది. వీటి ప్రకారం.. 5,172 నిప్పటించిన ఘటనలు చోటుచేసుకున్నాయి. నిరసనకారులు 4,786 ఇళ్లు, 386 ప్రార్థనా మందిరాలకు నిప్పు అంటించారు. రాష్ట్ర ఆయుధగారం నుంచి 5,668  ఆయుధాలను లూటీ చేశారు. వాటిల్లో 1,329 ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక భద్రతా బలగాలు 360 బంకర్లను ధ్వంసం చేశారు. మైదాన, పర్వత ప్రాంతాల మధ్య ఏర్పాటు చేసిన బారికేడ్లను గురువారం తొలగించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments