Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోర్టు తీర్పులకు జగన్ నైతిక బాధ్యత వహించాలి: సీపీఐ

Webdunia
గురువారం, 11 జూన్ 2020 (19:55 IST)
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన మొండివైఖరి మార్చుకోకుండా ప్రభుత్వ న్యాయవాదులచే రాజీనామాలు చేయించడం సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. ఈ మేరకు గురువారం ఆయ‌న ఒక ప్రకటన విడుదల చేశారు.

"హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి పలు కేసుల విషయంలో చుక్కెదురైంది. రాష్ట్ర ప్రభుత్వం సృష్టించిన పలు వివాదాస్పద అంశాల విషయంలో హైకోర్టు మొట్టికాయలు వేసింది.

కోర్టుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వస్తున్నాయని ప్రభుత్వ న్యాయవాదులు పెనుమాక వెంకట్రావు, గడ్డం సతీష్‌బాబు, షేక్ హబీబ్‌లచే రాజీనామా చేయించారు. కొత్తగా న్యాయవాదులను నియమించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

అధికారంలోకి వచ్చినప్పటి నుండి పలు అంశాలను వివాదాస్పదం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయా తీర్పులకు నైతిక బాధ్యత వహించాలి. 'తాను ఆడలేక మద్దెల ఓడు' అన్నట్లు ముగ్గురు ప్రభుత్వ న్యాయవాదులను రాజీనామా చేయించటం సరికాదు.

ప్రభుత్వం చేసే తప్పులకు న్యాయవాదులు ఎలా కారణమవుతారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన విధానాలను మార్చుకోపోతే ఏ లాయర్లను పెట్టినప్పటికీ కోర్టు తీర్పుల్లో మార్పులుండవని స్పష్టం చేస్తున్నాం" అని రామ‌కృష్ణ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Story: అల్లు అర్జున్, ప్రభాస్ కు మధ్య దీపిక పదుకొనె ఎంపిక చిచ్చు రగిలిస్తుందా?

Deepika Padukone: అల్లు అర్జున్, అట్లీ చిత్రంలో బాలీవుడ్ దీపికా పదుకొనె

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments