ఆ నవరత్నాలు.. జగన్మోహన్ రెడ్డిని గెలిపించాయ్..

Webdunia
గురువారం, 23 మే 2019 (17:00 IST)
వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 46 ఏళ్ల జగన్ రెడ్డి 175 ఏపీ సీట్లలో 145 సీట్లు గెలుచుకున్నారు. టీడీపీ 25 సీట్లలో ముందంజలో వుంది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో వైకాపా ముందంజలో వుంది.


ఈ నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డి అత్యధిక సీట్లలో గెలుపును నమోదు చేసుకోవడానికి కారణం ఏమిటనే దానిపై ఆరా తీస్తే.. వైకాపా కార్యాలయం తాడేపల్లి గూడెంకు మారడం గెలుపుకు తొలి మెట్టు అని జనం అనుకుంటున్నారు. అమరావతికి సమీపంలో తాడేపల్లిలో వైకాపా ఆఫీసును ఏర్పాటు చేయడం ఆ పార్టీకి ప్లస్ అయ్యింది. 
 
అలాగే ఎన్నికల ప్రచారంలో జగన్ ప్రకటించిన నవరత్నాల హామీలు ఆ పార్టీకి గెలుపును సంపాదించిపెట్టాయి. ఇంకా అమరావతి రాజధాని నిర్మాణంలో రియల్ ఎస్టేట్ బిజినెస్, అవినీతి, ఇర్రిగేషన్ ప్రాజెక్టులు, ఇంకా ఏపీ సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం వంటివి జగన్‌ను గెలిపించాయి. చంద్రబాబు హామీలను నెరవేర్చకపోవడంతో ఓటర్లు జగన్ ప్రకటించిన పథకాలపై ఆకర్షితులయ్యారు. 
 
ముఖ్యంగా వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డికి పాదయాత్ర అనుకూల ఫలితాలను ఇచ్చింది. దివంగత నేత వైఎస్. రాజశేఖర్ రెడ్డి తరహాలో ఎన్నికలకు ముందు పాదయాత్ర చేపట్టడం ఆ పార్టీకి కలిసొచ్చింది. ఈ క్రమంలో 3648 కిలోమీటర్ల మేర జగన్ పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్ర సందర్భంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 
 
ఈ సందర్భంగానే నవరత్నాలు అనే పేరిట తొమ్మిది హామీలు ఇచ్చారు. ఈ నవరత్న పథకాలను జగన్ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచారు. రైతుల పథకాలు, వయో ఫించన్లు, ఆరోగ్య బీమా, విద్యార్థులకు భారీ ఫీజు రీయింబర్స్‌మెంట్స్, పేద ప్రజలు ఇళ్ల నిర్మాణాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ కారణాల వల్లే జగన్ రెడ్డి ఏపీలో అత్యధిక సీట్లతో ముందంజలో వున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil: దీపావళి శుభాకాంక్షలతో అక్కినేని అఖిల్, జైనాబ్ రవ్జీ

James Cameron : జేమ్స్ కామెరూన్.. అవతార్: ఫైర్ అండ్ యాష్.. కోసం భారతదేశంలో ఈవెంట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments