జగన్‌పై దాడి కేసు విచారణ ముమ్మరం

Webdunia
ఆదివారం, 28 అక్టోబరు 2018 (16:23 IST)
ఏపీ శాసనసభ ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిపై వైజాగ్ విమానాశ్రయంలో జరిగిన దాడిపై దర్యాప్తు బృందం విచారణ ముమ్మరం చేసింది. నిందితుడు శ్రీనివాస్‌ రావు చెప్పినట్లుగా లేఖ రాసిన వ్యక్తితో పాటు మరొక వ్యక్తిని పోలీసులు విచారించారు.
 
నిందితుడి స్వగ్రామమైన తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం ఠానేల్లంకలోని అతడి బంధువులు, స్నేహితులను విచారించి వివరాలు సేకరిస్తున్నారు. దాడికి రెండ్రోజుల ముందే శ్రీనివాస్‌ కొత్త సిమ్‌ కొనుగోలు చేయడంతో దానికి సంబంధించిన ఫోన్‌కాల్స్‌పై దర్యాప్తు చేస్తున్నారు. 
 
నిందితుడు పనిచేసే రెస్టారెంట్‌ యజమానికి సైతం నోటీసులు జారీచేసి విచారణ చేశారు. ఈ దాడికి సంబంధించి శ్రీనివాస్‌ను ఎవరైనా ప్రలోభపెట్టారా? అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. నిందితుడు గతంలో కొద్దిరోజులు దుబాయిలో పనిచేశాడని, ఆ తర్వాత స్వదేశానికి తిరిగొచ్చిన తర్వాత బెంగళూరులోని ఓ హోటల్‌లో పనిచేశాడని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేస్తున్న ఇట్లు మీ ఎదవ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments