Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ‌గ‌న్ కొత్త త‌ర‌హా నేత‌, బీసీల ఆత్మ‌గౌర‌వాన్ని నిల‌బెట్టాడు

Webdunia
మంగళవారం, 13 జులై 2021 (17:06 IST)
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్త తరహా నాయకుడ‌ని, సంప్రదాయ బద్ధమైన నాయకుడు కాద‌ని ప్రభుత్వ సలహాదారులు సజ్జ‌ల రామకృష్ణ రెడ్డి విశ్లేషించారు. సంప్రదాయ బద్దమైన రాజకీయాలు చేస్తూ, త‌న‌ లబ్ది కోసం కాకుండా, భావితరాల భవిష్యత్తు కోసం చూసే నాయకుడ‌ని కొనియాడారు.

కొంతమంది చేయలేని పనులను మన నాయకుడు చేస్తుంటే, రాజకీయ శూన్యంతో కొంద‌రు ఆరోపణలు చేస్తూ, పిచ్చిరాతలు రాస్తున్నార‌ని ఎల్లో మీడియాను స‌జ్జ‌ల దుయ్య‌బ‌ట్టారు. ఇలాంటి దుష్పచారాలను మనమందరం కలిసి తిప్పికొట్టాల‌న్నారు. దేశంలోనే ఎన్నడూ లేనివిధంగా బిసిల ఆత్మగౌరవం నిలబెట్టిన నాయకుడు జగన్మోహన్ రెడ్డిఅని, గత నాయకులు బలహీనవర్గాలను ఓటు బ్యాంకుగా చూస్తే, వారి ఎదుగుదల కోసం జ‌గ‌న్ కృషి చేస్తున్నార‌న్నారు.

ముఖ్యమంత్రి బిసిలోని 139 కులాలకు గొప్ప అవకాశం కల్పించార‌ని, దానిని ఉపయోగించుకొని సామజికంగా,రాజకీయంగా ఎదగాల‌ని పిలుపునిచ్చారు. మిమ్మల్ని ఓటు బ్యాంకుగా చూసే వారికి మీ ఎదుగుదలే సమాధానంగా మారాలి అని జ‌గ‌న్ ఆకాంక్షగా చెప్పారు. బిసి కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు వారికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ముఖ్యమంత్రి ఆకాంక్షకు అనుగుణంగా పనిచేయాలని కోరుకుంటున్నా అని స‌జ్జ‌ల పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments