Webdunia - Bharat's app for daily news and videos

Install App

సొంత చెల్లి ధరించిన పసుపు చీర గురించి ఇలా మాట్లాడుతారా? షర్మిల

సెల్వి
శుక్రవారం, 26 ఏప్రియల్ 2024 (17:59 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి సోదరి, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ వై.ఎస్. షర్మిల రెడ్డి అన్నారు. పసుపు చీరను ధరించి.. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడిని కలవడంపై ఏపీ సీఎం జగన్ చేసిన విమర్శలకు ధీటుగా సమాధానం ఇచ్చారు. సొంత చెల్లి గురించి మాట్లాడుతున్న జగన్ మోహన్ రెడ్డికి కనీస మర్యాద లోపించిందని షర్మిల అన్నారు.
 
గుంటూరులో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ, బహిరంగ సభలో వేలాది మంది ప్రజల ముందు తన దుస్తుల గురించి మాట్లాడినందుకు కాంగ్రెస్ నాయకురాలు షర్మిల ఆయనపై మండిపడ్డారు.
 
"నేను చంద్రబాబు (నాయుడు) ముందు మోకరిల్లిపోయాను, నేను పసుపు రంగు చీర కట్టుకున్నాను, నేను చంద్రబాబు స్క్రిప్ట్ చదువుతున్నాను. పసుపు రంగుపై చంద్రబాబుకు పేటెంట్ హక్కు ఉందా" అని కడప జిల్లా పులివెందులలో జరిగిన బహిరంగ సభలో జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై షర్మిల తీవ్రంగా స్పందించారు. గతంలో సాక్షి ఛానల్ పసుపు రంగులో ఉండేదన్న విషయాన్ని జగన్ మోహన్ రెడ్డి మర్చిపోయారని షర్మిల అన్నారు.
 
'పసుపు శుభకరమైన రంగు అని వైఎస్‌ఆర్‌ గారే స్వయంగా చెప్పారని, పసుపు రంగు టీడీపీ సొత్తు కాదన్నారు. సాక్షికి పసుపును తానే ఎంచుకున్నారని' ఆమె గుర్తు చేశారు.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments