Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఎం జగన్ సంచలన నిర్ణయం.. మంత్రులు కూడా ఆ పని చేయాల్సిందే..

Webdunia
శుక్రవారం, 28 ఫిబ్రవరి 2020 (12:40 IST)
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రజాసేవ నిమిత్తం మంత్రులు సచివాలయంలో అందుబాటులో ఉండాలంటూ జగన్ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజలకు, అర్జీదారుల కొరకు ప్రతీ బుధవారం సెక్రటేరియేట్‌లో వారంతా హాజరు కావాలని జగన్ ఆదేశించారు. 
 
గతంలో జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా ప్రతి మంగళవారం, బుధవారం విధిగా సచివాలయానికి రావాలని సీఎం ఆదేశించిన సంగతి విదితమే. అయితే దూరభారం, సంక్షేమ పథకాల దృష్ట్యా మంత్రులకు వెసులుబాటు కల్పిస్తూ వారంలో ఒక్క రోజు ఉంటే సరిపోతుందని తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
 
ఇటీవలే అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన వంటి పలు పథకాలను ప్రారంభించిన ప్రజాసేవ కోసం మంత్రులను అందుబాటులోకి ఉంచాలని నిర్ణయించారు. వైసీపీ అధినేత సీఎం జగన్ కు ప్రజలు కట్టబెట్టింది మామూలు అధికారం కాదు.. ఏకంగా క్లీన్ స్వీప్ లాంటిదే. 
 
బలమైన టీడీపీని 23 సీట్లకే పరిమితం చేసి ఏకంగా 150మందికిపైగా ఎమ్మెల్యేలను జగన్‌కు కట్టబెట్టారు. అలా అధికారం కట్టబెట్టిన ప్రజల కోసం ప్రభుత్వం అండగా నిలవాలని.. ప్రజా సంక్షేమాల కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని సీఎం మంత్రులను రంగంలోకి దించారు.

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments