ఇసుక మాఫియాను ''లోకేష్ ర్యాంప్'' అని పిలుస్తున్నారు: జగన్

ఏపీ మంత్రి నారా లోకేష్‌పై వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. తూర్పుగోదావరి జిల్లా గన్నవరంలో నిర్వహించిన ర్యాలీలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ... ఈ మండలంలోని లంకల గన్నవరంలో రోజూ వేల లారీల ఇసుక ద

Webdunia
మంగళవారం, 19 జూన్ 2018 (10:09 IST)
ఏపీ మంత్రి నారా లోకేష్‌పై వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. తూర్పుగోదావరి జిల్లా గన్నవరంలో నిర్వహించిన ర్యాలీలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ... ఈ మండలంలోని లంకల గన్నవరంలో రోజూ వేల లారీల ఇసుక దోచేస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రాంతంలో కొనసాగుతున్న ఇసుక మాఫియాను లోకేష్ ర్యాంప్ అని స్థానికులు పిలుచుకుంటున్నారని తెలిపారు.
 
ఈ ప్రాంతానికి అధికారులు కానీ, పోలీసులు కానీ ఎవ్వరూ వెళ్లట్లేదని ఆరోపించారు. మట్టిని, ఇసుకను దోచుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు విధానాలతో విసిగిపోయిన కోనసీమ రైతులు, కూలీలు వలసపోతున్నారని.. కొబ్బరిపై ఐదు శాతం జీఎస్టీని చంద్రబాబు వేయించారని జగన్ తెలిపారు. చంద్రబాబు ఢిల్లీకి వెళ్తూ యుద్ధానికి వెళ్తున్నట్లు బిల్డప్ ఇచ్చి.. చివరికి ఉత్తర కుమారుడు మాదిరిగా తిరిగొచ్చారని ఎద్దేవా చేశారు. 
 
ఢిల్లీ పర్యటనలో ఏదో చేస్తానని వెళ్లిన చంద్రబాబు.. చివరికి మోదీకి వంగి వంగి షేక్ హ్యాండిచ్చేందుకు యత్నించారని చెప్పారు. కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌ భర్తను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా కొనసాగిస్తున్నారని, మహారాష్ట్ర మంత్రి భార్యకు టీటీడీ మెంబర్ పదవి కట్టబెట్టారని, మరోవైపు బాలకృష్ణ షూటింగ్‌కు వెంకయ్యనాయుడు వస్తారని పేర్కొంటూ.. బీజేపీ, టీడీపీ బంధం కొనసాగుతోందనడానికి ఇవే సాక్ష్యాలన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగ శౌర్య, శ్రీదేవి విజయ్ కుమార్ ఎమోషనల్ సాంగ్

హార్ట్‌ వీక్‌గా ఉన్నవాళ్లు ఈషా సినిమా చూడొద్దు : బన్నీ వాస్‌, వంశీ నందిపాటి

ఏవీఎం శరవణన్ భౌతికకాయానిక నివాళులు.. సూర్య కంటతడి

నా నుంచి ఎలాంటి బ్రేకింగ్ న్యూస్‌లు ఆశించకండి : రాజ్ నిడిమోరు మాజీ భార్య

Nayanatara: చిరంజీవి, నయనతార లపై రెండవ సింగిల్ శశిరేఖ లిరికల్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments