Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నారా లోకేష్ నిజాలు మాట్లాడేస్తున్నారని బాబు ట్విట్టర్లో కూర్చోబెట్టారు: రోజా ఎద్దేవా(Video)

నాలుగేళ్లపాటు భాజపాతో అధికారం పంచుకుని ఇప్పుడు బయటకు వచ్చేసి పోరాటం చేస్తామని చెప్పడం తెలుగుదేశం పార్టీకే చెల్లిందని వైసీపి ఎమ్మెల్యే రోజా విమర్శించారు. కడప స్టీల్ ప్లాంట్ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని సీఎం రమేష్ చెప్పడం పబ్లిసిటీ స్టంట్ తప్ప మరొ

నారా లోకేష్ నిజాలు మాట్లాడేస్తున్నారని బాబు ట్విట్టర్లో కూర్చోబెట్టారు: రోజా ఎద్దేవా(Video)
, శనివారం, 16 జూన్ 2018 (18:44 IST)
నాలుగేళ్లపాటు భాజపాతో అధికారం పంచుకుని ఇప్పుడు బయటకు వచ్చేసి పోరాటం చేస్తామని చెప్పడం తెలుగుదేశం పార్టీకే చెల్లిందని వైసీపి ఎమ్మెల్యే రోజా విమర్శించారు. కడప స్టీల్ ప్లాంట్ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని సీఎం రమేష్ చెప్పడం పబ్లిసిటీ స్టంట్ తప్ప మరొకటి కాదన్నారు. అధికారంలో వున్నన్నాళ్లు పట్టించుకోకుండా ఇప్పుడు ధర్మపోరాటం అంటూ ఫ్యాన్లు కింద కూర్చుని నిత్యానంద స్వామిలా ఆయన ఆశీర్వదిస్తున్నారంటూ చంద్రబాబు నాయుడుపై సెటైర్లు వేశారు రోజా. 
 
నారా లోకేష్ గురించి మాట్లాడుతూ... లోకేష్ గారు ట్విట్టర్లో కామెంట్లన్నీ ఎవరో రాసినవి అప్ లోడ్ చేస్తుంటారని అన్నారు. ఆయన ఎంత నిజంగా మాట్లాడుతారో అందరికీ తెలుసునన్నారు. తమ పార్టీ బంధుప్రీతిని కలిగిన పార్టీ అని చెప్పి తెలుగుదేశం పార్టీలో జరుగుతున్నదేమిటో తేటతెల్లం చేశారన్నారు. అందుకే చంద్రబాబు నాయుడుకి భయం వేసి ఆయనను ట్విట్టర్లో కూర్చోబెట్టారని అన్నారు. చూడండి ఈ వీడియోలో ఆమె వ్యాఖ్యలు... 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యేడాది పాపపై అత్యాచారం.. ఆపై తలపై కొట్టి చంపిన మానవమృగం