Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్‌ను వీడి తప్పు చేశా.. టీడీపీలో నేను వలసపక్షిని...

సంచలన కామెంట్స్ చేయడంలోనూ, వివాదాల్లో చిక్కుకోవడంలోనూ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డికి మంచి పేరుతో పాటు గుర్తింపు కూడా ఉన్నాయి. ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు టీడీపీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారాయి. రాజక

Webdunia
గురువారం, 31 ఆగస్టు 2017 (09:55 IST)
సంచలన కామెంట్స్ చేయడంలోనూ, వివాదాల్లో చిక్కుకోవడంలోనూ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డికి మంచి పేరుతో పాటు గుర్తింపు కూడా ఉన్నాయి. ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు టీడీపీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారాయి. రాజకీయ భిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీని వీడి తప్పు చేశాననీ, ఇపుడు టీడీపీలో తాను వలస పక్షిని అని ఆయన వ్యాఖ్యానించారు. 
 
అనంతపురం జిల్లా గుత్తి వ్యవసాయ మార్కెట్ యార్డు నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో అనంతపురం ఎంపీ జెసి దివాకర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మార్కెట్ యార్డు ఛైర్మెన్‌తో పాటు ఇక్కడున్నవారంతా ఒకే పార్టీలో సుదీర్ఘంగా ఉన్నారని, తాను మాత్రమే వలస పక్షిని అని వ్యాఖ్యానించారు. 
 
పైగా టీడీపీలో చేరినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు కిరీటమేమీ పెట్టలేదన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీని వీడి తప్పు చేశాననే బాధ ఉందన్నారు. ఇకపోతే.. 2019 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారని, కానీ, ఆలోగా అది పూర్తి కాదన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments