Webdunia - Bharat's app for daily news and videos

Install App

వల్లభనేని వంశీ - దేవినేని అవినాశ్ ఇంట్లో ఐటీ సోదాలు

Webdunia
మంగళవారం, 6 డిశెంబరు 2022 (10:50 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, వైకాపా నేత దేవినేని అవినాశ్ ఇళ్ళలో ఆదాయపన్ను శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. వల్లభనేని వంశీ గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయన టీడీపీ టిక్కెట్‌పై గెలిచి వైకాపా పంచన చేశారు. అలాగే, దేవినేని అవినాశ్ కూడా కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత టీడీపీ, ఇపుడు వైకాపాలో ఉన్నారు. 
 
ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరం నుంచి ఐటీ అధికారులు మంగళవారం ఉదయం 6 గంటల నుంచి ఈ ఇద్దరి నేతల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు. ఈ సోదాలు సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉంది. అయితే ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఐటీ అధికారులు సోదాలకు రావడం ఇపుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. 
 
ఈ సోదాల వెనుక కారణం ఏంటో ఎవరికీ అంతు చిక్కడం లేదు. హైదరాబాద్ నగరంలోని వంశీరామ్ రియల్ ఎస్టేట్ కంపెనీలో వీరు పెట్టుబడులు పెట్టారా? అనే కోణంలో ఈ సోదాలు జరుగుతుండొచ్చని భావిస్తున్నారు. అయితే, ఈ తనీఖీలు పూర్తయితేగానీ అసలు గుట్టు తెలిసే అవకాశంలేకపోలేదు. ప్రస్తుతం ఈ సోదాలు అధికార వైకాపాలో కలకలం రేపుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments