Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యాలయాలు తెరిచేది అనుమానమే

Webdunia
మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (05:50 IST)
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం కేంద్రం లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కారణంగా విద్యాలయాలను కూడా మూసేశారు.

అయితే వచ్చే 14వ తేదీ నుంచి లాక్ డౌన్ ఎత్తేసినా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం విద్యాలయాలు తెరిచేది అనుమానంగానే వుంది. స్కూళ్లు తెరిస్తే విద్యార్థులు గుంపులు గుంపులుగా చేరటం ఖాయం.

ఫలితంగా సామాజిక దూరానికి విఘాతం కలుగుతుంది. అందువల్ల ఇటువంటి పరిస్థితి రాకుండా ముందుస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు ప్రభుత్వానికి సూచిస్తున్నారు.

ఇప్పటికే ఆరు నుంచి తొమ్మిదవ తరగతి వరకు వార్షిక పరీక్షలు నిర్వహించకుండా ఆల్‌ పాస్‌ ఉత్తర్వులు ఇచ్చారు. పదో తరగతి పరీక్షలు కూడా వాయిదా వేశారు. విద్యా క్యాలెండర్‌ ప్రకారం ఈ నెల 23 వరకు స్కూళ్లు పని చేస్తాయి. 24 నుంచి వేసవి సెలవులు ఉంటాయి.

ఈ నెల 14 తరువాత ఈ విద్యా సంవత్సరంలో ఆదివారాలు పోనూ ఇంకా 7 పనిదినాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. తాజా పరిస్ధితుల్లో ఈ కొద్ది రోజులు స్కూళ్లు తెరిపించినా ఒనకూరే ప్రయోజనం ఏమీ లేదని భావిస్తున్నారు.

ఒకేసారి వేసవి సెలవుల వరకు అంటే జూన్‌ 11వ తేదీ వరకు స్కూళ్లు మూత తప్పదని ఉన్నతాధికారులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments