Webdunia - Bharat's app for daily news and videos

Install App

వృద్దాప్య పింఛన్లు హాంఫట్.. కొత్తగా మంజూరైన పింఛన్లో దళారుల చేతివాటం

Webdunia
సోమవారం, 3 ఫిబ్రవరి 2020 (20:04 IST)
కొత్తగా మంజూరైన పింఛన్‌దారులు ఒక్కొక్కరి దగ్గరి నుండి సుమారుగా రూ. 1250 వసూళ్ల వ్యవహారం బయటకి పొక్కడంతో నాయకులు కల్పించుకొని తిరిగి ఇప్పించారు. 
 
నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం తల్వాయిపాడు గ్రామం అక్రమాలకు అడ్డాగా మారింది. ప్రభుత్వం ఎంతో శ్రమకోర్చి పేద ప్రజలకొరకు తలకుమించిన భారమైనా కూడా ఎంతో బాధ్యతతో ఇంటింటికి పింఛన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 
 
కానీ కొందరు దళారులు మేము మీకు పింఛన్లు రావడానికి సహాయం చేసామనే నెపంతో ఒక్కొక్కరి దగ్గర సుమారుగా రూ. 1250/- వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మాట ఆనోటా ఈనోట పొక్కి  విషయం బయటకు రావడంతో  విషయం పెద్దది అవుతుందని భావించిన పెద్దమనుషులు కల్పించుకొని పింఛన్‌దారులకు కొంతమందికి వారి సొమ్ము తిరిగి ఇప్పించారని సమాచారం. 
 
దీనిపై పంచాయతీ సెక్రటరీని వివరణ కోరగా ఇప్పటివరకు మా దృష్టికి రాలేదని అన్నారు. వివరాలు సేకరించి తగు చర్యలకై ఉన్నతాధికారులకు తెలియ జేస్తామని చెప్పారు. 
 
గ్రామస్థులు కొందరు దీనిపై వాలంటైర్‌ని ప్రశ్నించగా తనకు తెలియదని,, వారి దగ్గర బయటి వ్యక్తులు వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపణలు వినిపిస్తున్నాయని చెప్పుకొచ్చారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments