Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రగ్స్‌ కేసుపై లోతైన విచారణ : విశాఖ సీపీ

Webdunia
మంగళవారం, 7 జులై 2020 (08:20 IST)
విశాఖలో వెలుగుచూసిన డ్రగ్స్‌ కేసుకు సంబంధించి లోతైన దర్యాప్తు జరుపుతున్నామని  పోలీసు కమీషనర్‌ రాజీవ్‌ కుమార్‌ మీనా తెలిపారు.

ఆయన మాట్లాడుతూ.. డ్రగ్స్‌ కేసుకు సంబంధించి నలుగురు నిందితుల్లో ఒకరైన మానుకొండ సత్యనారాయణ గతంలో రేవ్‌పార్టీ కేసులో నిందితుడిగా ఉన్నాడని చెప్పారు.

సత్యనారాయణ, అతని స్నేహితుడు అజయ్‌ బెంగళూరు నుంచి డ్రగ్స్‌ తీసుకువచ్చినట్టు గుర్తించామని వెల్లడించారు. వీరు తీసుకొచ్చిన డ్రగ్స్‌కు మూలాలు బెంగళూరులో ఎక్కడున్నాయో గుర్తిస్తామని పేర్కొన్నారు. ఈ డ్రగ్స్‌ కేసులో బెంగళూరు, గోవా పోలీసులు సహకారం తీసుకుంటామని చెప్పారు.

కేసుకు సంబంధించి నలుగురు నిందితులను పోలీసు కస్టడీలోకి తీసుకుని విచారణ చేపడతామన్నారు. నగరంలో జరిగే పుట్టిన రోజు పార్టీలకు సరఫరా చేసేందుకు డ్రగ్స్‌ తీసుకువచ్చినట్టుగా తెలుస్తోందన్నారు.

నిందితులు యువతను లక్ష్యంగా చేసుకుని ఈ దందా సాగిస్తున్నారని చెప్పారు. డ్రగ్స్‌కు అలవాటు పడ్డవారిని గుర్తించి వారికి డీఎడిక్షన్‌ సెంటర్‌లో చికిత్స అందిస్తామని తెలిపారు.

సత్యనారాయణ కదలికలపై నిఘా పెట్టడం వల్లే డ్రగ్స్‌ ముఠా గుట్టురట్టైందన్నారు. సత్యనారాయణపై మూడు కేసులు ఉన్నాయని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

దక్షిణాదిలో సమంత రీ ఎంట్రీ గ్రాండ్‌గా వుండబోతోంది.. చెర్రీ, పుష్పలతో మళ్లీ రొమాన్స్!?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments