Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖ్యమంత్రికి ఐఎఎస్ అధికారుల సంఘం రూ. 20 లక్షల విరాళం అందజేత

Webdunia
గురువారం, 2 ఏప్రియల్ 2020 (22:47 IST)
కరోనా వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు బాసటగా నిలుస్తూ ఐఎఎస్ అధికారుల సంఘం ప్రకటించిన ఇరవై లక్షల రూపాయల విరాళాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అందించారు.

ఐఎఎస్ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి, పర్యాటక, భాషా సాంస్కృతిక, క్రీడా యువజనాభ్యుదయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో పలువురు సీనియర్ ఐఎఎస్ అధికారులు గురువారం తాడేపల్లి  క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి ఇందుకు సంబంధించిన పత్రాన్ని అందించారు. 
 
ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన 162 ఐఎఎస్ అధికారులు తమ మూడు రోజుల వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇచ్చేందుకు ముందుకు రాగా, ఆ మొత్తం రూ.20 లక్షలుగా ఉంది. 
 
ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ కరోనా వ్యాప్తి నిరోధానికి ముఖ్యమంత్రి విభిన్న కార్యక్రమాలు చేపట్టేలా ఐఎఎస్ అధికారులకు మార్గదర్శకాలు జారీ చేస్తున్నారని, వాటిని అమలు చేయటంతో తమ శక్తి వంచన లేకుండా పనిచేస్తామని పేర్కొన్నారు. సిఎంను కలిసిన వారిలో సీనియర్ ఐఎఎస్ అధికారులు ఎస్ఎస్ రావత్, విజయకుమార్, ప్రధ్యుమ్న తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments