Webdunia - Bharat's app for daily news and videos

Install App

అద్దె ఇంట్లో మద్యం సేవించాడనీ... 4వ అంతస్తు నుంచి తోసేశాడు...

అద్దెకు ఇచ్చిన ఇంట్లో మద్యం సేవించాడని ఆ వ్యక్తిని ఇంటి యజమాని కుమారుడు నాలుగో అంతస్తు నుంచి కిందికి తోసేశాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే,

Webdunia
ఆదివారం, 23 సెప్టెంబరు 2018 (12:28 IST)
అద్దెకు ఇచ్చిన ఇంట్లో మద్యం సేవించాడని ఆ వ్యక్తిని ఇంటి యజమాని కుమారుడు నాలుగో అంతస్తు నుంచి కిందికి తోసేశాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్, నారాయణగూడలో సంజు అనే యువకుడు ఆ ప్రాంతంలో ఉండే ఓ అపార్ట్‌మెంట్‌లో అద్దెకు దిగాడు. ఇతనికి మద్యం సేవించే అలవాటు ఉంది. దీంతో ప్రతి రోజూ రాత్రి మద్యాన్ని ఇంటికి తెచ్చుకుని సేవించేవాడు.
 
ఈ విషయం ఇంటి యజమాని కుమారుడు బశ్వంత్‌కు తెలిసింది. దీంతో సంజుతో గొడవపడ్డాడు. మద్యం సేవించవద్దని హెచ్చరిక కూడా చేశాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం సంజు మద్యం సేవిస్తుండగా బశ్వంత్ చూశాడు. 
 
దీంతో అతనితో వాగ్వాదానికి దిగాడు. వీరిద్దరి మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరిగింది. ఫలితంగా సహనం కోల్పోయిన బశ్వంత్.. సంజును నాలుగో అంతస్తు నుంచి కిందికి తోసేశాడు. అక్కడ నుంచి కిందపడటంతో సంజుకు బలమైన గాయాలు తగిలాయి. 
 
ఆ తర్వాత అతన్ని ఆస్పత్రికి తరలించేలోపు చనిపోయాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. సంజును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments