Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్తాపూర్ పిల్లర్ నంబర్ 139 వద్ద.. వెంటాడి.. వేటాడి నరికేశాడు.. భయంతో పారిపోయిన ఖాకీలు

హైదారాబాద్ నగరంలో దారుణ హత్య జరిగింది. అదీ కూడా పట్టపగలు, నగరం నడిబొడ్డున ఈ హత్య జరిగింది. ఒకవైపు పోలీసు వాహనం ఆగివుండగా, ఆ పక్కనే పోలీసులు నిలబడివున్నారు. అయినా ఏమాత్రం పట్టించుకోని ఆ కిరాతకుడు ఓ వ్య

Webdunia
బుధవారం, 26 సెప్టెంబరు 2018 (15:13 IST)
హైదారాబాద్ నగరంలో దారుణ హత్య జరిగింది. అదీ కూడా పట్టపగలు, నగరం నడిబొడ్డున ఈ హత్య జరిగింది. ఒకవైపు పోలీసు వాహనం ఆగివుండగా, ఆ పక్కనే పోలీసులు నిలబడివున్నారు. అయినా ఏమాత్రం పట్టించుకోని ఆ కిరాతకుడు ఓ వ్యక్తిని అడ్డంగా నరికేసి వెళ్లిపోయాడు. బుధవారం జరిగిన ఈ దారుణ హత్య వివరాలను పరిశీలిస్తే...
 
హైదరాబాద్ నగరంలో అత్తాపూర్‌ వద్ద మెట్రో రైల్ పిల్లర్ నం‌.139 దగ్గర ఓ యువకుడిని గుర్తుతెలియని వ్యక్తి ఒకరు గొడ్డలితో నరికి చంపాడు. అదీకూడా దాదాపు 100 మీటర్ల దూరంవరకు వెంటాడి వేటాడి అతికిరాతకంగా హత్యచేశాడు. ఆ సమయంలో ట్రాఫిక్ పోలీసులు అక్కడే ఉన్నా.. పోలీసు వాహనం ముందే ఈ దారుణం జరగడం విచారకరం. 
 
తనను రక్షించాలంటూ ఆ యువకుడు ఆర్తనాదాలు పెట్టినా పోలీసులు సాహసం చేయలేదు. అక్కడున్న వారు రక్షించేందుకు ప్రయత్నించినా.. అవతలి వ్యక్తి చేతిలో గొడ్డలి ఉండటంతో భయపడుతూ వెనక్కి తగ్గారు. దాడి తర్వాత పారిపోతున్న ఇద్దరు నిందితులను ట్రాఫిక్ పోలీసులు అడ్డగించి పట్టుకున్నారు. ఘటనాస్థలికి పోలీసులు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి వివరాలు, ఎందుకు హత్య చేశారన్న విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments