Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకరితో పెళ్లి.. ఇద్దరితో అక్రమ సంబంధం.. భార్యకు తెలిసి...

ఓ వ్యక్తి ఓ మహిళను పెళ్లాడాడు. ఇద్దరితో వివాహేతర సంబంధం కొనసాగించాడు. ఈ విషయం తెలిసిన భార్య జీర్ణించుకోలేకపోయింది. భర్త చేసిన నమ్మక ద్రోహాన్ని తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్

Webdunia
ఆదివారం, 30 సెప్టెంబరు 2018 (18:03 IST)
ఓ వ్యక్తి ఓ మహిళను పెళ్లాడాడు. ఇద్దరితో వివాహేతర సంబంధం కొనసాగించాడు. ఈ విషయం తెలిసిన భార్య జీర్ణించుకోలేకపోయింది. భర్త చేసిన నమ్మక ద్రోహాన్ని తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
హైదరాబాద్, బంజారాహిల్స్‌లోని ఎస్వీనగర్‌లో నివసించే శ్రీలక్ష్మి(26), వేణుగోపాల్‌ అలియాస్‌ వంశీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం గత 2012లో జరిగింది. వీరి సంసారజీవితం కొంతకాలం పాటు సాఫీగానే సాగింది. ఈ క్రమంలో తనతో పాటు పని చేసే ఓ యువతితో వంశీకి పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధానికి దారితీసింది. 
 
ఈ విషయం భార్యకు తెలియడంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగి విషయం కోర్టు వరకు వెళ్లింది. ఇదిలావుండగా, సంస్థ ప్రచార పని మీద వంశీ గోవాకు వెళ్లాడు. అక్కడ మరో యువతితో సంబంధం నెరిపాడు. ఆమెనూ వివాహం చేసుకొనేందుకు నిర్ణయించుకున్నాడు. అతని భార్యకు తెలియడంతో మనోవేదనకు గురై శుక్రవారం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సమయానికి ఇంట్లో ఉన్న ఆమె సోదరి ప్రశాంతి అక్క పరిస్థితిని గమనించి జూబ్లీహిల్స్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించడంతో ప్రాణగండం తప్పింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments