Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలుడు చేతులు విరగ్గొట్టి ముళ్ళ పొదల్లో పడేశారు...

Webdunia
బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (09:17 IST)
ఇటీవలి కాలంలో నేరాలు ఘోరాలకు భాగ్యనగరం అడ్డాగా మారిపోతోంది. ఈ నేరాల అడ్డుకట్టకు ప్రభుత్వం ఎన్నో రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ నేరగాళ్లు మాత్రం రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా ఓ బాలుడుని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి రెండు చేతులు విరగ్గొట్టి ముళ్ళపొదల్లో పడేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ రెయిన్‌బజార్ పరిధిలోని యాకుత్‌పురాకు చెందిన ఆరేళ్ళ బాలుడిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత అతని రెండు చేతులు విరగ్గొట్టి ఆ బాలుడిని ముళ్లపొదల్లో పడేశారు. ఈ ఘటన మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో జరిగింది. 
 
ఆ తర్వాత తమ కుమారుడు కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. గాలించగా, ఆ బాలుడు ముళ్లపొదల్లో ఉన్నట్టు గుర్తించారు. ఆ తర్వాత ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ బాలుడి కిడ్నాప్ ఘటన వెనుక ఏదైనా కుట్ర ఉందా లేదంటే ఇది భిక్షగాళ్ళ మాఫియా ఉందా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

వర్జిన్ బాయ్స్ ట్రైలర్ లోనే అడల్ట్ కంటెంట్ - దానిని టీనేజర్స్ తో పబ్లిసిటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

తర్వాతి కథనం
Show comments