Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య గర్భం దాల్చిందని విడాకులు కోరిన భర్త..?

Webdunia
మంగళవారం, 13 ఆగస్టు 2019 (14:40 IST)
ప్రేమించి పెళ్ళిచేసుకున్నాడు. రెండేళ్ళు కాపురం చేశాడు. భార్య గర్భవతి అయ్యాక ప్లేటు ఫిరాయించాడు. భార్య తనతో కాపురానికి రాలేదని కుటుంబ పెద్దలకు చెప్పాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేశాడు. భర్తకి ఫోన్ చేసి విసిగిపోయిన బాధితురాలు అత్తింటి ముందు ధర్నాకు దిగింది.
 
చిత్తూరు జిల్లా కుప్పం మండలం కత్తిమలిపల్లికి చెందిన వినోద్, వి.కోటకు చెందిన అనితను ప్రేమించి పెళ్ళిచేసుకున్నాడు. కులాంతర వివాహం కావడంతో ఇంటి నుంచి బయటకు వచ్చి పెళ్ళి చేసుకున్నాడు. రెండేళ్ళ పాటు కాపురం చేశాడు. ఈలోపు రెండుసార్లు ఆమెకు అబార్షన్ చేయించాడు. మళ్ళీ గర్భం దాల్చడంతో ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలనుకున్నాడు.
 
ఇంటి నుంచి వచ్చేశాడు. తనతో భార్య కాపురానికి రావడం లేదని ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పాడు. విడాకుల నోటీసులు భార్యకు పంపాడు. దీంతో భార్య అనితకు ఏం చేయాలో పాలుపోలేదు. పెద్దలను తీసుకొచ్చి మాట్లాడింది. ఉపయోగం లేకుండా పోయింది. దీంతో తన భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది. న్యాయం కావాలని కోరుతోంది. పోలీసులకు భర్తపై ఫిర్యాదు చేసింది. అనిత ఫిర్యాదు చేసిన విషయాన్ని తెలుసుకున్న వినోద్ పరారీలో ఉన్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం