Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ఫీలు తీసి బజారుపాల్జేస్తావా? భర్త మందలింపు.. భార్య ఆత్మహత్య..?

Webdunia
శనివారం, 16 ఫిబ్రవరి 2019 (20:35 IST)
సెల్ఫీ కాస్త ఒక కుటుంబంలో విషాదాన్ని నింపింది. తన భార్య ప్రతిచోటా సెల్ఫీలు తీసుకుని సామాజిక మాథ్యమాల్లో పోస్టులు చేస్తోందంటూ భర్త ఆమెపై ఆగ్రహంతో ఊగిపోయాడు. తరచూ సెల్ఫీ గొడవే వీరి మధ్య రావడంతో చివరకు చేసేది లేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. చిత్తూరు జిల్లాలో సంఘటన జరిగింది. 
 
చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన చంద్రజ్యోతి కుప్పం మండలంలోని గుడుపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. రెండు నెలల క్రితం వి.కోటలోని డిసిసి బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న శరత్ అనే యువకుడికి ఇచ్చి వివాహం చేశారు. 
 
నెల రోజుల వరకు వీరి జీవితం సాఫీగానే సాగింది. అయితే గత నెలరోజులుగా చంద్రజ్యోతి పాఠశాలలో పిల్లలతో, తన స్నేహితులతో సెల్ఫీలు తీసుకుంటూ ఫోటోలను ఫేస్ బుక్, వాట్సాప్‌లలో పోస్టులు చేస్తోంది. దాంతో పాటు ఎక్కడికి వెళ్ళినా సెల్ఫీ తీసుకోవడం చంద్రజ్యోతికి అలవాటుగా మారిపోయింది.
 
ఇది భర్తకు ఏ మాత్రం ఇష్టం లేదు. దీంతో భార్యను మందలించాడు. భర్త ఎంత చెప్పినా చంద్రజ్యోతి పట్టించుకోలేదు. దీంతో వీరిద్దరి మధ్య నిన్న రాత్రి గొడవ తారాస్థాయికి చేరింది. ఇలా సెల్ఫీలు తీస్తూ పరువు తీస్తున్నావంటూ రాత్రి శరత్ కోపంతో తన స్వస్థలం శ్రీకాళహస్తికి వెళ్ళిపోయాడు. దీంతో మనస్థాపానికి గురైన చంద్రజ్యోతి ఇంటిలో ఫ్యాన్‌ను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చంద్రజ్యోతి మరణంతో ఆమె కుటుంబం విషాధంలో మునిగిపోయింది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments