Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరులో రొట్టెల పండుగ.. భారీగా తరలివచ్చిన భక్తులు

Webdunia
ఆదివారం, 30 జులై 2023 (14:41 IST)
జిల్లా కేంద్రమైన నెల్లూరులో రొట్టెల పండుగ జరిగింది. ఈ పండుగ కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. కోరిన కోర్కెలు తీర్చే పండగగా ఈ రొట్టెల పండుగ ప్రసిద్ధిగాంచింది. ఈ పండుగ శనివారం నుంచి ప్రారంభమైంది. స్థానికంగా ఉండే స్వర్ణాల చెరువు ప్రాంగణంలో ఈ పండుగ ప్రారంభమైంది. 
 
ఐదు రోజుల పండుగలో భాగంగా, తొలిరోజున బారాషాబీద్ దర్గాలో 12మంది అమరవీరుల సమాధులను ముస్లిం మతపెద్దలు సంప్రదాయబద్ధంగా శుభ్రం చేసి, నూతన వస్త్రాలను సమాధులపై కప్పి ప్రార్థనలు నిర్వహించారు.
 
కాగా, ఈ పండుగ తొలి రోజున రాష్ట్రం నుంచేగాక తమిళనాడు, కర్ణాటక, కేరళ తదితర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. స్వర్ణాల చెరువులో స్నానం చేసిన అనంతరం కోర్కెల రొట్టెల కోసం ఎగబడ్డారు. అంతకుముందు దర్గాలో ప్రార్థనలు చేశారు. 
 
జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ అధికార బృందంతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు 2500 మందితో పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ టీడీపీ నేతలు స్వర్ణాల చెరువులో రొట్టెను వదిలి, వారు కూడా పట్టుకున్నారు. 
 
ఇక పండుగలో కీలక ఘట్టమైన గంధ మహోత్సవం ఆదివారం రాత్రి జరుగనుంది. ఈ కార్యక్రమానికి కడప పెద్ద దర్గా పీఠాధిపతి ఆరిఫుల్లా హుసేనీ విచ్చేసి ఈ గంధ మహోత్సవంలో పాల్గొననున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments