Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రాబ్యాంక్‌లో భారీ చోరీ

Webdunia
మంగళవారం, 15 అక్టోబరు 2019 (08:36 IST)
చిత్తూరు జిల్లా యాదమరి మండలం మొర్దానపల్లె ఆంధ్రాబ్యాంక్‌లో భారీ చోరీ జరిగింది. లాకర్‌లో ఉన్న 17 కేజీల బంగారం, పెట్టెలోని రూ.2.66 లక్షల నగదు అపహరణకు గురైంది.

ఈ చోరీ సోమవారం వెలుగులోకొచ్చింది. శుక్రవారం విధులు పూర్తయిన తర్వాత సిబ్బంది బ్యాంకుకు తాళాలు వేసుకుని వెళ్లారు. శని, ఆదివారం కార్యాలయానికి సెలవు. అయినప్పటికీ మేనేజర్‌ పురుషోత్తం శనివారం బ్యాంకుకు వచ్చి మధ్యాహ్నం వరకు పనిచేసి వెళ్లారు.

సోమవారం ఉదయం సిబ్బంది విధులకు హాజరుకాగా.. అప్పటికే బ్యాంకులో సీసీ కెమెరాలకు సంబంధించిన హార్డ్‌డిస్క్‌ కన్పించలేదు. నగదు పెట్టెలోని రూ.2.66 లక్షలు కూడా మాయమైనట్టు నిర్ధారించారు. దీంతో మేనేజర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంకుకు చేరుకున్న పోలీసులకు అక్కడ చోరీ జరిగిన ఆనవాళ్లు (తాళాలు, గోడ పగులగొట్టడం వంటివి) కనిపించలేదు.

దాంతో అనుమానం వచ్చి బ్యాంకు లాకర్‌ను తెరిపించి చూడగా.. అందులోని బంగారం మొత్తం మాయమైంది. ప్రాథమిక విచారణలో రూ.3.45 కోట్లు విలువచేసే 17 కిలోల బంగారం అపహరణకు గురైనట్టు తేలినట్టు సమాచారం. బ్యాంకు మేనేజరును పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఆయన ఇంట్లోనూ సోదాలు చేసినట్లు తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments