Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతిలో జర్నలిస్టుల గృహ నిర్మాణాల విషయంలో కీలక నిర్ణయం.. ఏంటది?

Webdunia
మంగళవారం, 6 నవంబరు 2018 (21:07 IST)
అమరావతి : అఫర్డబుల్ హౌసింగ్ స్కీమ్‌లో జర్నలిస్టులకు మరింత వెసులుబాటు కల్పిస్తూ సమాచార పౌర సంబంధాలు, గ్రామీణ గృహ నిర్మాణ శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు నిర్ణయం తీసుకున్నారు. సచివాలయంలో సంబంధిత అధికారులతో ఈరోజు జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 365, 430, 720, 1200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇళ్లు నిర్మించుకోవచ్చని మంత్రి కాలవ ప్రకటించారు. 
 
ఇళ్ల నిర్మాణం కోసం ఈ నెల 9వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే సౌకర్యం అందుబాటులోకి రానుంది. లబ్ధిదారులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడంతోపాటు, ఆయా జిల్లాల డీపీఆర్వోలకు దరఖాస్తు కాపీ అందించాల్సి ఉంటుంది. రాజధాని, ఢిల్లీలో పనిచేసే విలేకరులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న తరవాత, వారు సమాచార కమిషనర్ కార్యాలయంలో దరఖాస్తు అందించాల్సి ఉంటుంది. అన్ని వివరాలను ఇప్పటికే సమాచార శాఖ జేడీలు, డీడీలు, డీపీఆర్వోలకు పంపించారు. 
 
ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకునే వారు ముందుగా ఎఫ్‌ఏ‌క్యూ చూసుకుని అప్లికేషన్ అప్‌లోడ్ చేసుకోవాలని తెలిపారు. సచివాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో గృహనిర్మాణ శాఖ ఓఎస్డీ సత్యనారాయణ, సమాచార శాఖ జేడీ పి. కిరణ్ కుమార్, పలువురు అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments