Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతిలో జర్నలిస్టుల గృహ నిర్మాణాల విషయంలో కీలక నిర్ణయం.. ఏంటది?

Webdunia
మంగళవారం, 6 నవంబరు 2018 (21:07 IST)
అమరావతి : అఫర్డబుల్ హౌసింగ్ స్కీమ్‌లో జర్నలిస్టులకు మరింత వెసులుబాటు కల్పిస్తూ సమాచార పౌర సంబంధాలు, గ్రామీణ గృహ నిర్మాణ శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు నిర్ణయం తీసుకున్నారు. సచివాలయంలో సంబంధిత అధికారులతో ఈరోజు జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 365, 430, 720, 1200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇళ్లు నిర్మించుకోవచ్చని మంత్రి కాలవ ప్రకటించారు. 
 
ఇళ్ల నిర్మాణం కోసం ఈ నెల 9వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే సౌకర్యం అందుబాటులోకి రానుంది. లబ్ధిదారులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడంతోపాటు, ఆయా జిల్లాల డీపీఆర్వోలకు దరఖాస్తు కాపీ అందించాల్సి ఉంటుంది. రాజధాని, ఢిల్లీలో పనిచేసే విలేకరులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న తరవాత, వారు సమాచార కమిషనర్ కార్యాలయంలో దరఖాస్తు అందించాల్సి ఉంటుంది. అన్ని వివరాలను ఇప్పటికే సమాచార శాఖ జేడీలు, డీడీలు, డీపీఆర్వోలకు పంపించారు. 
 
ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకునే వారు ముందుగా ఎఫ్‌ఏ‌క్యూ చూసుకుని అప్లికేషన్ అప్‌లోడ్ చేసుకోవాలని తెలిపారు. సచివాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో గృహనిర్మాణ శాఖ ఓఎస్డీ సత్యనారాయణ, సమాచార శాఖ జేడీ పి. కిరణ్ కుమార్, పలువురు అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments