Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాస్టల్ వార్డెన్ సాహసం.. విద్యార్థుల గురించి ఆలోచించి.. చంపానదిని దాటారు..

Webdunia
మంగళవారం, 13 సెప్టెంబరు 2022 (14:10 IST)
భారీ వర్షాలకు విజయనగరం జిల్లా, గజపతినగరం మండలం మర్రివలస దగ్గర చంపావతి నదిలో ఒక్కసారిగా భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ సందర్భంగా విజయనగరం జిల్లాలో హాస్టల్ వార్డెన్ పెద్ద సాహసం చేశారు. 
 
సొంత పనుల మీద స్వగ్రామానికి వచ్చిన ఆమె వార్డెన్ హాస్టల్‌లోని విద్యార్థుల పరిస్థితి గురించి ఆలోచించారు. ఆ వెంటనే తన సోదరుల సాయంతో నది దాటి ఒడ్డుకు చేరారు. ప్రాణాలకు తెగించి విద్యార్థుల గురించి ఆలోచించిన వార్డెన్ కళావతి ప్రస్తుతం నెట్టింట సెలెబ్రిటీగా మారిపోయారు. 
 
మరోవైపు విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం, మర్రివలస వద్ద చంపావతి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో నదికి అవతల వున్న ఏడు గిరిజన గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామం నుంచి మండల కేంద్రానికి చేరుకోవడానికి నదిని దాటుతూ నానా అవస్థలు పడుతున్నారు. 
 
మంగళవారం చంపావతి నదిని దాటేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. చంపావతి నదిని దాటడం కోసం నాటు బల్లుతో విద్యార్థులను నదిని దాటించారు. 
 
మర్రివలస గ్రామం నుంచి చంపావతి నదిని దాటుతూ గజపతినగరం, మెంటాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు, ప్రైవేట్ పాఠశాలలకు దాదాపు 75మంది విద్యార్థులు వెళ్తున్నారు. ఈ నదిపై బ్రిడ్జి లేకపోవడంతో ప్రతిరోజూ విద్యార్థులు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments