సీఎం కేసీఆర్ వినాశనానికే ఇదంతా చేస్తున్నారు : ఈటల మండిపాటు

Webdunia
మంగళవారం, 13 సెప్టెంబరు 2022 (13:39 IST)
అసెంబ్లీ సమావేశాలు ముగిసేంతవరకు తనను సస్పెండ్ చేయడంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం కేసీఆర్ వినాశనానికే ఇదంతా చేస్తున్నారంటూ మండిపడ్డారు. యేడాది కాలంగా తనపై కుట్రలు చేస్తున్నారని, ఎమ్మెల్యేగా మళ్లీ గెలిచినప్పటి నుంచి తనను అసెంబ్లీకి రానివ్వకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ను గద్దె దింపేంత వరకు విశ్రమించబోనని స్పష్టం చేశారు. కేసీఆర్ తాటాకు చప్పుళ్లకు భయపడే వ్యక్తిని కాదని చెప్పారు. 
 
మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా, స్పీకర్ పోచారం శ్రీనివాసులు రెడ్డిని ఉద్దేశించి ఈటల రాజేందర్ మాట్లాడుతూ మర మనిషి అంటూ సంబోధించారు. దీంతో ఈటలను ఈ సమావేశాలు ముగిసేంత వరకు ఈటలను సస్పెండ్ చేశారు. అనంతరం ఆయన సభ నుంచి బయటకు వచ్చిన తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
ఈ క్రమంలో ఈటల పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసు వాహనం ఎక్కేందుకు ఆయన నిరాకరించారు. తన సొంత వాహనంలోనే వెళ్తానని చెప్పారు. అయినప్పటికీ పోలీసులు ఈటలను బలవంతంగా తమ వాహనంలోకి ఎక్కించి, శామీర్‌పేటలోని ఆయన ఇంటి వద్ద వదిలిపెట్టారు. ఈ సందర్భంగా పోలీసులపై ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. బానిసల మాదిరిగా బతకొద్దని సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Fauji shooting: తూఫ్రాన్ పేటలో ఫౌజీ షూటింగ్‌ - ప్రభాస్ కు గాయాలు వార్తలో అవాస్తవం లేదు !

Mohan Babu: మోహన్ బాబును చంద్రబాబు మోసం చేశాడా ? ఎందుకంటే...!

Nani: పారడైజ్ లో లౌడ్ ఎన్విరాన్‌మెంట్ పై కేర్ - విడుదల తేదీ మార్పు

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి షోల్డర్ కీహోల్ సర్జరీ

Kamalhasan: కమల్ హాసన్ చిత్రం సెయాన్ లో శివకార్తికేయన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలోవెరా జ్యూస్ తాగితే ఏం జరుగుతుంది?

హైదరాబాద్‌లో టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026 ను నిర్వహించిన టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్

ప్రేమకు సరికొత్త భాష: శ్రద్ధను, ఉద్దేశాన్ని చాటిచెప్పే వాలెంటైన్స్ డే బహుమతులు

చక్కెర స్థాయిలు తగ్గించి ఎముకపుష్టికి ఉపయోగపడే గోధుమరవ్వ వంటకం

మొలలు లేదా పైల్స్ వున్నవారు తినకూడని పదార్థాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments