Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోర్టుకు రావాలంటూ ఏపీ డీజీపీకి హైకోర్టు ఆదేశాలు

Webdunia
బుధవారం, 24 జూన్ 2020 (08:45 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ బాస్‌కు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం మరోమారు కబురుపంపింది. కోర్టుకు హాజరుకావాలంటూ ఆదేశించింది. దీనికి కారణం లేకపోలేదు. ఇటీవల తెలుగుదేశం పార్టీ నేతలు యనమల రామకృష్ణుడు, చింతకాయల అయన్నపాత్రుడు ఓ వివాహానికి హాజరయ్యారు. ఇలా హాజరుకావడం లాక్డౌన్ రూల్స్ ఉల్లంఘించినట్టేనని పేర్కొంటూ వారిద్దరిపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
పైగా, మరికొందరు వివాహాలు జరుపుకునేలా ప్రోత్సహించారని కూడా ఆరోపిస్తూ దానిపై కూడా మరో కేసును నమోదు చేశారు. దీంతో అయ్యన్నపాత్రుడు ఏపీ హైకోర్టును ఆశ్రయించడంతో ఆయలతో పాటు.. ఎవరినీ అరెస్టు చేయడానికి వీల్లేదంటూ కోర్టు స్టే ఆర్డర్ జారీచేసింది. 
 
అంతేకాకుండా, ఈ వివాహానికి హాజరైన మరికొందరు కూడా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పోలీసులు నిబంధనలు ఉల్లంఘించి తమ వాహనాలను సీజ్ చేశారంటూ పేర్కొన్నారు. వీటన్నింటినీ పరిశీలించిన హైకోర్టు.. ఏపీ హైకోర్టు డీజీపీ గౌతం సవాంగ్‌ను నేరుగా హాజరుకావాలంటూ ఆదేశాలు జారీచేసింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments