Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ నెత్తిన హైకోర్టు సమ్మెటపోటు.. మంత్రులతో భేటీ.. గెలుపు బాధ్యత మీదే!!

Webdunia
బుధవారం, 8 జనవరి 2020 (19:52 IST)
నవ్యాంధ్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి నెత్తిన హైకోర్టు పిడుగువేసింది. మార్చి నెల మూడో తేదీలోపు స్థానిక సంస్థలను నిర్వహించాలంటూ బుధవారం ఆదేశాలు జారీచేసింది. దీంతో ముఖ్యమంత్రి జగన్ తన మంత్రివర్గ సహచరులతో అత్యవసరంగా సమావేశమయ్యారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఏం చేద్దామంటూ ఆయన మంతనాలు నిర్వహించారు. 
 
నిజానికి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్ తీసుకుంటున్న నిర్ణయాలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ముఖ్యంగా, రాజధాని అమరావతి తరలించాలనే నిర్ణయం తీసుకోగా, దీన్ని చాలా మంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా రాజధాని అమరావతి ప్రాంతంలో రైతుల ఆందోళన తీవ్రరూపం దాల్చుతోంది. దీనిపై జగన్ ఒక స్పష్టత ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. 
 
దీంతో మంత్రులతో సమావేశమైన సీఎం జగన్... స్థానిక ఎన్నికల్లో పార్టీ గెలుపుపై మంత్రుల భుజస్కంధాలపై మోపారు. రాజధాని అంశం, స్థానిక ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం కొత్త జిల్లాల ఏర్పాటును సీఎం జగన్ వాయిదా వేసుకున్నట్లుగానే తెలుస్తోంది.
 
అదేసమయంలో ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చినట్టుగా రాష్ట్రంలో 25 జిల్లాల ఏర్పాటు నిర్ణయాన్ని కూడా ఆయన వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 25 లోక్‌సభ స్థానాలు ఉండగా, ఒక్కో స్థానాన్న్ ఒక్కో జిల్లాగే చేస్తామని జగన్ తన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నారు. కానీ, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం కూడా వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కన్నప్ప మూవీ రివ్యూ- కథ మారింది-కల్పితం: నేటి జనరేషన్ నిజం అని నమ్మే ప్రమాదం వుంది!

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments