Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేర్ని నానిపై కేసు : ఏ క్షణమైనా అరెస్టు... హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్

ఠాగూర్
మంగళవారం, 31 డిశెంబరు 2024 (13:48 IST)
వైకాపా నేత, మాజీ మంత్రి పేర్ని నానిపై నమోదైంది. గోదాము నుంచి రేషన్ బియ్యం మాయమైన వ్యవహారంలో ఆయనపై మచిలీపట్నం తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి, ఈ కేసులో ఆయనను ఆరో నిందితుడిగా చేర్చారు. ఈ కేసులో ఏ1గా పేర్ని నాని భార్య జయసుధ పేరు ఉంది. ఆమెకు కృష్ణా జిల్లా కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. 
 
ఇదే కేసులో ఏ2, ఏ3, ఏ4, ఏ5గా ఉన్న వారందరినీ పోలీసులు అరెస్టు చేశారు. వీరికి మచిలీపట్నం స్పెషల్ మొబైల్ కోర్టు జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. ప్రస్తుతం వీరంతా మచిలీపట్నంలోని సబ్ జైలులో ఉన్నారు. తాజాగా పేర్ని నానిపై కూడా కేసు నమోదైంది. ఆయనను పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది.
 
ఈ అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఆయన ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేశారు. పేర్ని నాని  పిటిషన్‍ను విచారించేందుకు కోర్టు అంగీకరించింది. దీంతో మంగళవారం మధ్యాహ్నంపైన ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారించనుంది. తన గోదాము నుంచి రేషన్ బియ్యం బస్తాల మాయం కేసులో తనను అరెస్టు చేయకుండా ఉండేలా రక్షణ కల్పించాలని ఆయన లంచ్ మోషన్ పిటిషన్‌‍లో దాఖలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments