Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ జాతీయ పార్టీ చేతిలో 'పాచికలు'గా మారిన ఆ ఇద్దరు ఎవరు?

టాలీవుడ్ సినీ హీరో గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ జాతీయ పార్టీ ఆపరేషన్ ద్రవిడ పేరుతో దక్షిణ భారతదేశంలో పాగా వేసేందుకు భారీ ప్రణాళికనే రూపొందించిందని చెప్పుకొచ్చారు.

Webdunia
గురువారం, 22 మార్చి 2018 (20:02 IST)
టాలీవుడ్ సినీ హీరో గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ జాతీయ పార్టీ ఆపరేషన్ ద్రవిడ పేరుతో దక్షిణ భారతదేశంలో పాగా వేసేందుకు భారీ ప్రణాళికనే రూపొందించిందని చెప్పుకొచ్చారు. అంతేనా, ఆ జాతీయ పార్టీ చేతిలో పాత నేత ఒకరు, కొత్త నేత వరకు కీలుబొమ్మలుగా మారారని ఆరోపించారు. ఇపుడు ఆ ఇద్దరు నేతలు ఎవరన్నదానిపై సర్వత్రా చర్చ సాగుతోంది. 
 
ఆయన గురువారం విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ, 2019 ఎన్నికలే టార్గెట్‌గా ఓ జాతీయ పార్టీ దక్షిణాదిపై ఆపరేషన్ ద్రవిడ చేపట్టిందని ఆయన తన స్పీచ్ ప్రారంభించారు. ఇందులో భాగమే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌‌లో ఆపరేషన్ గరుడ అని చెప్పారు. 
 
ఈ విషయం తనకు 2017లోనే తెలుసని, కానీ ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే ఆ నిజాలు చెప్పక తప్పలేదన్నారు. ఇప్పుడీ రాష్ట్రంలో జాతీయపార్టీ పెట్టిన మిషన్‌లో ఇద్దరు కీలక వ్యక్తులున్నారని చెప్పుకోవాలి. ఈ మొత్తం ఆపరేషన్‌కు ప్రధానమైనటువంటి వ్యక్తి ఒకరున్నారన్నారు. 
 
ఆ ప్రధాన వ్యక్తిని గురు అని పిలుస్తారు. ఈ గురు ఆదేశాలను రాజ్యంగ బద్ధమైనటువంటి పదవుల్లోని కొందరు ఆ పథకాన్ని ఇక్కడ అమలు చేస్తారు అంటూ నిశితంగా మ్యాప్ రూపంలో శివాజీ వివరించారు. అయితే ఆ ఇద్దరు ఎవరనేది చెప్పడానికి శివాజీ సాహసించలేకపోయారు. ఎందుకంటే తాను న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోలేనని బహిరంగంగా చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments