Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీదేవిని ఆమె స్నేహితులే చంపేశారు : కాళహస్తి ఆలయ ఆస్థాన పండితులు

ప్రముఖ నటి శ్రీదేవి మరణం మళ్లీ వివాదాస్పదం అవుతుంది. శ్రీదేవి మృతిపై ఆయన చేసిన కామెంట్స్‌తో ఈ అంశం మరోమారు తెరపైకి వచ్చింది. శ్రీదేవిది సహజ మరణం కాదని.. ఆమెది హత్య అని ప్రముఖ జ్యోతిష్య పండితులు, శ్రీక

శ్రీదేవిని ఆమె స్నేహితులే చంపేశారు : కాళహస్తి ఆలయ ఆస్థాన పండితులు
, సోమవారం, 19 మార్చి 2018 (11:39 IST)
ప్రముఖ నటి శ్రీదేవి మరణం మళ్లీ వివాదాస్పదం అవుతుంది. శ్రీదేవి మృతిపై ఆయన చేసిన కామెంట్స్‌తో ఈ అంశం మరోమారు తెరపైకి వచ్చింది. శ్రీదేవిది సహజ మరణం కాదని.. ఆమెది హత్య అని ప్రముఖ జ్యోతిష్య పండితులు, శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం ఆస్థాన పండితులు ములుగు రామలింగేశ్వరస్వామి వ్యాఖ్యానించారు. ఉగాది పంచాంగ శ్రవణంలో చెప్పారు. శీదేవిని సన్నిహితులే చంపారని.. ఆమె సహజంగా చనిపోలేదని అన్నారు.
 
ఇకపోతే, ఈ యేడాది డిసెంబరులోగా ఎన్నికలు జరిగితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అనుకూల ఫలితాలు వస్తాయని తెలిపారు. 'తెలంగాణలో 2019 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు విజయం దక్కుతుంది. తద్వారా మూడో ఫ్రంట్‌ ప్రాధాన్యాన్ని సంతరించుకుంటుంది. గుజరాత్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, ఒడిసా, బిహార్‌లో బీజేపీకి సీట్లు కనీసం సగానికి తగ్గుతాయి. సీమాంధ్ర, తెలంగాణల్లో బీజేపీకి ఒక లోక్‌సభ సీటు కూడా దక్కదు. రజనీకాంత్‌ రాజకీయాల్లో రాణిస్తాడని చెప్పుకొచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీడీపీ అవిశ్వాసం : సభలో అనుకూలం.. వ్యతిరేకం