Webdunia - Bharat's app for daily news and videos

Install App

తితిదే ఛైర్మన్ పదవి నాకా? మోహన్ బాబు

Webdunia
బుధవారం, 5 జూన్ 2019 (13:06 IST)
ఎన్నికలకు ముందు తాను పదవుల కోసం వైకాపాలో చేరలేదని సినీ నటుడు మోహన్ బాబు వివరణ ఇచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలక మండలి ఛైర్మన్‌గా మోహన్ బాబును నవ్యాంధ్ర ముఖ్యమంత్రి జగన్ నియమించనున్నారనే వార్తలు మీడియాలో వస్తున్నాయి. వీటిపై మోహన్ బాబు వివరణ ఇచ్చారు. 
 
తాను తితిదే ఛైర్మన్ రేసులో ఉన్నట్టు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. తాను జగన్‌ను నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా చూడాలని అనుకున్నాను. అందుకోసం తన వంతు కృషి చేశాను. ప్రజల ముఖ్యమంత్రిగా జగన్ ఉంటారనే నమ్మి తాను రాజకీయాల్లోకి వచ్చాను. అందుకే ఆ పార్టీలో చేరాను. అంతేకానీ, తాను ఏ పదవులు ఆశించలేదని, దీనిపై మీడియాలో వస్తున్న వదంతులను ఆపాలని ఆయన కోరారు. 
 
కాగా, వైఎస్. జగన్ మోహన్ రెడ్డికి మోహన్ బాబు బంధువు కూడా అవుతారు. ఆయన కుమారుడు విష్ణు వివాహం చేసుకుంది జగన్ బంధువునే కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments