Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త సంవత్సరం: శ్రీవారి ఆలయం అందం.. స్వామివారి ప్రతిరూపం అద్భుతం

Webdunia
బుధవారం, 1 జనవరి 2020 (14:42 IST)
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు లీలలు అన్నీ ఇన్నీ కావు. ఎందెందు వెతికినా అందందు కలడు స్వామివారు. స్వామివారిని పూజిస్తే అనుకున్నది నెరవేరుతుందనేది భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే ఎంతో వ్యయప్రయాసలతో భక్తులు అశేషంగా తిరుమలకు తరలివస్తుంటారు. ఆ స్వామివారిని దర్సించుకుంటుంటారు. 
 
నూతన సంవత్సరం రోజు శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దారు. వివిధ రకాల పుష్పాలతో ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. రంగురంగుల విద్యుత్ దీపాలంకరణలతో స్వామివారి ఆలయం విరాజిల్లుతోంది. నూతన సంవత్సరం రోజు స్వామివారిని దర్సించుకుంటే ఆ యేడాది మొత్తం ప్రశాంతంగా, ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా గడిచిపోతుందని భక్తుల నమ్మకం. అందుకే పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకున్నారు.
 
అర్థరాత్రి ఏకాంత సేవ తరువాత తెల్లవారుజాము నుంచి పలువురు విఐపిలు స్వామివారిని దర్సించుకున్నారు. ఆ తరువాత సర్వదర్సనం లైన్ ను టిటిడి అధికారులు వదిలారు. మొత్తం 30కంపార్టుమెంట్లు భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. గోవిందనామస్మరణలతో తిరుమల మాఢావీధులు మారుమ్రోగుతున్నాయి. తిరుమల ప్రధాన మార్గం వద్ద నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ హోర్డింగ్ ను టిటిడి ఏర్పాటు చేసింది. అలాగే అక్కడక్కడ కూడా హోర్డింగ్ లు దర్సనమిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments