Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త సంవత్సరం: శ్రీవారి ఆలయం అందం.. స్వామివారి ప్రతిరూపం అద్భుతం

Webdunia
బుధవారం, 1 జనవరి 2020 (14:42 IST)
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు లీలలు అన్నీ ఇన్నీ కావు. ఎందెందు వెతికినా అందందు కలడు స్వామివారు. స్వామివారిని పూజిస్తే అనుకున్నది నెరవేరుతుందనేది భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే ఎంతో వ్యయప్రయాసలతో భక్తులు అశేషంగా తిరుమలకు తరలివస్తుంటారు. ఆ స్వామివారిని దర్సించుకుంటుంటారు. 
 
నూతన సంవత్సరం రోజు శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దారు. వివిధ రకాల పుష్పాలతో ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. రంగురంగుల విద్యుత్ దీపాలంకరణలతో స్వామివారి ఆలయం విరాజిల్లుతోంది. నూతన సంవత్సరం రోజు స్వామివారిని దర్సించుకుంటే ఆ యేడాది మొత్తం ప్రశాంతంగా, ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా గడిచిపోతుందని భక్తుల నమ్మకం. అందుకే పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకున్నారు.
 
అర్థరాత్రి ఏకాంత సేవ తరువాత తెల్లవారుజాము నుంచి పలువురు విఐపిలు స్వామివారిని దర్సించుకున్నారు. ఆ తరువాత సర్వదర్సనం లైన్ ను టిటిడి అధికారులు వదిలారు. మొత్తం 30కంపార్టుమెంట్లు భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. గోవిందనామస్మరణలతో తిరుమల మాఢావీధులు మారుమ్రోగుతున్నాయి. తిరుమల ప్రధాన మార్గం వద్ద నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ హోర్డింగ్ ను టిటిడి ఏర్పాటు చేసింది. అలాగే అక్కడక్కడ కూడా హోర్డింగ్ లు దర్సనమిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments