Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్పెయిన్‌లో ''భీష్మ''.. న్యూఇయర్ వేడుకలు అక్కడే.. సింగిల్ వైరల్

స్పెయిన్‌లో ''భీష్మ''.. న్యూఇయర్ వేడుకలు అక్కడే.. సింగిల్ వైరల్
, బుధవారం, 1 జనవరి 2020 (14:20 IST)
గీత గోవిందం హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్న న్యూ ఇయ‌ర్ వేడుక‌ల్ని స్పెయిన్‌లో జ‌ర‌ుపుకోనుంది. నితిన్‌తో క‌లిసి ర‌ష్మిక న‌టిస్తున్న తాజా చిత్రం భీష్మ‌. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ఇటీవ‌లే ఇట‌లీలో మొద‌లైంది. 
 
జ‌న‌వ‌రి మొద‌టి వారం వ‌ర‌కు అక్క‌డే షూటింగ్ జ‌ర‌గ‌నుంది. కాబ‌ట్టి న్యూ ఇయ‌ర్ వేడుక‌ల త‌రువాతే ర‌ష్మిక ఇండియా రానుంది. నితిన్ కూడా త‌న `భీష్మ‌1 చిత్రం కోసం జ‌న‌వ‌రి మొద‌టి వారం వ‌ర‌కు ఇట‌లీలోనే వుంటారు. దీంతో న్యూ ఇయ‌ర్ వేడుక‌ల్ని అక్క‌డే జ‌రుపుకోబోతున్నారు.
 
కాగా సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో నితిన్, రష్మికలు జంటగా నటిస్తున్న 'భీష్మ' రూపొందుతోన్న విషయం తెలిసిందే. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే చాలావరకూ పూర్తయింది. అయితే... మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా నుంచి తాజాగా ఒక సింగిల్‌ను రిలీజ్ చేసారు. ఈ సింగిల్ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
"హైక్లాస్ నుంచి లోక్లాస్ దాకా నా క్రష్‌లే .. వందల్లో వున్నారులే.. ఒకళ్లూ సెట్టవ్వలే, కిస్సింగు కోసం .. హగ్గింగు కోసం .. వెయిటింగులే .. పాపెనుకే జాగింగులే .. " అంటూ సాగే ఈ పాటలో మహతి స్వరసాగర్ బాణీ... శ్రీమణి సాహిత్యం... అనురాగ్ కులకర్ణి ఆలాపన అన్నీ కూడా ఆకట్టుకునేలా వున్నాయి. 
 
యూత్‌కి నచ్చే ప్రేమకథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాపై నితిన్ చాలానే ఆశలు పెట్టుకున్నాడు. కాగా... నితిన్ - రష్మిక జోడీ బాగా కుదిరిందనే టాక్ కూడా ఫిల్మ్ నగర్‌లో బలంగా వినిపిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైపర్ ఆదికి, సుడిగాలి సుధీర్‌కి మధ్య గొడవ...