Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగాళాఖాతంలో అల్పపీడనం - కోస్తా జిల్లాలకు వర్ష హెచ్చరిక

Webdunia
శుక్రవారం, 14 జనవరి 2022 (09:27 IST)
బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడివుంది. దీంతో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని పలు చోట్ల శుక్రవారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 
 
ముఖ్యంగా, ఉత్తర తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం, కర్నాటక నుంచి విదర్భ, ఛత్తీస్‌గఢ్ మీదుగా ఒడిశా వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. ఈ ప్రభావం కారణంగా వచ్చే 24 గంటల్లో కోస్తాతో పాటు రాయలసీమలో అక్కడక్కడ వడగళ్ళ వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. 
 
అదేవిధంగా ఏపీలోని కోస్తా జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, శనివారం వరకు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఇక బంగాళాఖాతంలో తూర్పు గాలుల ప్రభావం అధికంగా ఉందని పేర్కొంది. 
 
గత రాత్రి శృంగవరకు కోటలో 9 సెంటీమీటర్లు, పార్వతీపురంలో 8 శాతం, పొన్నూరు, మంగళగిరి, గొలుగొండ్లలో 6 సెంమీ చొప్పున వర్షపాతం నమోదైంది. విశాఖపట్టణంలోనూ గత రాత్రి భారీ వర్షం కురిసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమిటీ కుర్రోళ్ళు నుంచి ‘ప్రేమ గారడీ..’ లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల‌

సమంతను పక్కనబెట్టి రష్మికను తీసుకున్న బిటౌన్?

అరవింద్ కృష్ణ SIT.. ఆశ్చర్యపరుస్తున్న సూపర్ హీరో లుక్

14 చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్

అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ 39 సంవత్సరాల తర్వాత చేస్తున్న కల్కి 2898 AD

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

తర్వాతి కథనం
Show comments