Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెస్ట్ గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - నలుగురి మృతి

Webdunia
శుక్రవారం, 14 జనవరి 2022 (09:16 IST)
ఏపీలోని వెస్ట్ గోదావరి జిల్లాలో భోగి పండుగ రోజున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. జిల్లాలోని నారాయణపురం నుంచి దువ్వాడకు చేపల లోడుతో వెళుతున్న లారీ ఒకటి తాడేపల్లిగూడెం వద్ద బోల్తాపడింది. లారీ ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తాకొట్టడంతో నలుగురు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానికులు రక్షంచి సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. 
 
ఈ రోడ్డు ప్రమాద వార్త గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రోడ్డుపై లారీ బోల్తా కొట్టడంతో 2 కిలోమీటర్ల మేరకు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అలాగే, మృతదేహాలను స్వాధీనం చేసుకుని ‌శవపరీక్ష కోసం ఆస్పత్రికి తరలించారు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments