Webdunia - Bharat's app for daily news and videos

Install App

దత్తత తీసుకున్న బాలికను చిత్రహింసలు పెట్టిన తల్లిదండ్రులు

Webdunia
మంగళవారం, 25 ఫిబ్రవరి 2020 (13:59 IST)
హైదరాబాదులో దారుణం జరిగింది. ఓ చిన్నారిపట్ల పెంపుడు తల్లిదండ్రులు దాష్టీకం ప్రదర్శించారు. వివరాల్లోకి వెళితే, నగరంలోని కాచీగూడా పోలీస్ స్టేషన్ పరిధి తిలక్ నగర్ ఇందిరా నగర్‌లో నివాసం ఉంటున్న ఓ దంపతులు ఏడేళ్ల పాపను దత్తత తీసుకున్నారు. దత్తత తీసుకుని ప్రేమను పంచాల్సిన తల్లిదండ్రులు.. చిన్నారిని చిత్రహింసలకు గురిచేశారు. 
 
బాలికతో వెట్టిచాకిరి చేయించారు. అంతేకాదు, నోటికి వచ్చినట్లుగా తిట్టటం, ఒళ్లు హూనం అయ్యేలా కొట్టడం, తాళ్లతో బంధించి చిత్రహింసలకు పాల్పడ్డారు. పాప పట్ల పెంపుడు తల్లిదండ్రులు ప్రవర్తిస్తున్న తీరును స్థానికులు గమనించారు. బాలల హక్కుల సంఘం ప్రతినిధులకు సమాచారం అందించారు. దీంతో వారు కాచీగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చైల్డ్ లేబర్ సహాయంతో పాపను కాపాడారు. ఒంటినిండా గాయాలతో వున్న చిన్నారిని వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. ఏడేళ్ల చిన్నారి పట్ల అంత్యంత కిరాతకంగా ప్రవర్తించిన పెంపుడు తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments