Webdunia - Bharat's app for daily news and videos

Install App

దత్తత తీసుకున్న బాలికను చిత్రహింసలు పెట్టిన తల్లిదండ్రులు

Webdunia
మంగళవారం, 25 ఫిబ్రవరి 2020 (13:59 IST)
హైదరాబాదులో దారుణం జరిగింది. ఓ చిన్నారిపట్ల పెంపుడు తల్లిదండ్రులు దాష్టీకం ప్రదర్శించారు. వివరాల్లోకి వెళితే, నగరంలోని కాచీగూడా పోలీస్ స్టేషన్ పరిధి తిలక్ నగర్ ఇందిరా నగర్‌లో నివాసం ఉంటున్న ఓ దంపతులు ఏడేళ్ల పాపను దత్తత తీసుకున్నారు. దత్తత తీసుకుని ప్రేమను పంచాల్సిన తల్లిదండ్రులు.. చిన్నారిని చిత్రహింసలకు గురిచేశారు. 
 
బాలికతో వెట్టిచాకిరి చేయించారు. అంతేకాదు, నోటికి వచ్చినట్లుగా తిట్టటం, ఒళ్లు హూనం అయ్యేలా కొట్టడం, తాళ్లతో బంధించి చిత్రహింసలకు పాల్పడ్డారు. పాప పట్ల పెంపుడు తల్లిదండ్రులు ప్రవర్తిస్తున్న తీరును స్థానికులు గమనించారు. బాలల హక్కుల సంఘం ప్రతినిధులకు సమాచారం అందించారు. దీంతో వారు కాచీగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చైల్డ్ లేబర్ సహాయంతో పాపను కాపాడారు. ఒంటినిండా గాయాలతో వున్న చిన్నారిని వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. ఏడేళ్ల చిన్నారి పట్ల అంత్యంత కిరాతకంగా ప్రవర్తించిన పెంపుడు తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments