Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాడు బతికేందుకు అర్హుడు కాదు.. ఉరికంటే పెద్ద శిక్షవుంటే..

Webdunia
ఆదివారం, 19 మే 2019 (09:03 IST)
సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డిని ఉరితీయాలని అతని తల్లిదండ్రులు, సోదరుడు డిమాండ్ చేస్తున్నారు. ఉరికంటే పెద్ద శిక్ష ఏదైనా ఉంటే ఆ శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. తమ కుమారుడు అంత దుర్మార్గుడని తమకు తెలియదని, అతడికి ఎంతటి శిక్ష విధించినా తక్కువే అవుతుందన్నారు. అందువల్ల అతడ్ని చంపేయాలని చెప్పారు. 
 
అతడి వల్ల తాము తలెత్తుకోలేకపోతున్నామని, ఉన్న ఊరును వదిలి ప్రాణభయంతో ఎక్కడెక్కడో తిరుగుతున్నామన్నారు. తమ కుమారుడు చేసిన వరుస హత్యలపై తండ్రి బాల్ రెడ్డి మాట్లాడుతూ, శ్రీనివాస్ రెడ్డి ఇన్ని దుర్మార్గాలకు పాల్పడతాడని తాము అనుకోలేదన్నారు. పైగా, అతడి ప్రవర్తనపై తమకు ఎప్పుడూ అనుమానం రాలేదన్నాడు. లిఫ్ట్ మెకానిక్‌గా పలు ప్రాంతాలు తిరిగేవాడని, గతేడాది గృహప్రవేశం సందర్భంగా ఇంటికి వచ్చాడని వివరించాడు.
 
కుమారుడి కారణంగా తమ బతుకులు ఆగమయ్యాయని అతడి తల్లి కన్నీరు పెట్టుకుంది. వాడిని చంపితేనే బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుందని, అమ్మాయిల ఆత్మకు శాంతి చేకూరుతుందని విజ్ఞప్తి చేసింది. వేములవాడకు చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని పలుమార్లు చెప్పాడని, ఆమెతో ఫోన్లో కూడా మాట్లాడించాడని వివరించింది. ఇన్ని ఘాతుకాలకు పాల్పడుతున్నా కుమారుడిపై తమకు ఎప్పుడూ అనుమానం రాలేదని చెప్పింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments