Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయంత్రం 6 గంటలకు ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్...

Webdunia
ఆదివారం, 19 మే 2019 (08:10 IST)
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఆదివారం సాయంత్రం 6 గంటలతో ముగియనుంది. ఆ తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడనున్నాయి. ఈనెల 23వ తేదీన లోక్‌సభ, నాలుగు అసెంబ్లీ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దేశమంతా ఎన్నికల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
 
మరోవైపు, తుది దశ పోలింగ్‌లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గోరఖ్‌పూర్‌లోని పోలింగ్ బూత్ నెంబర్ 246లో ఆయన ఓటు వేశారు. దేశవ్యాప్తంగా 59 ఎంపీ స్థానాలకు ఆదివారం  పోలింగ్ జరుగుతోంది. ఓటర్లంతా ఉదయం నుంచే భారీ సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొంటున్నారు. 
 
ఆదివారం ఈ పోలింగ్ ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరుగనుంది. ఈసారి 59 ఎంపీ స్థానాలకు 918 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇప్పటివరకు 483 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ పూర్తయింది. 
 
ఉత్తరప్రదేశ్‌లోని 13 లోక్ సభ స్థానాలకు, పంజాబ్‌లోని 13, పశ్చిమ బెంగాల్‌లోని 9, మధ్యప్రదేశ్‌లోని 8, బీహార్‌లోని 8, హిమాచల్‌ప్రదేశ్‌లోని 4, జార్ఖండ్‌లోని 3, చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతం లోక్‌సభ స్థానానికి పోలింగ్ జరుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments