తెలంగాణ రాష్ట్రం ఒప్పుకోక పోయినా పోలవరం పూర్తిచేస్తాం : జీవీఎల్

Webdunia
గురువారం, 21 జులై 2022 (08:26 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని తెలంగాణ రాష్ట్రం అంగీకరించకపోయినా పూర్తి చేస్తామని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పష్టంచేశారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. 'పోలవరం నిర్మాణానికి తెలంగాణ రాష్ట్రం ఒప్పుకుంది. నిజం చెప్పాలంటే వాళ్లు ఒప్పుకోవడంతో పని లేదు. తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకున్నట్లుగా కేంద్ర చట్టంలో ఉంది' అని అన్నారు. 
 
పోలవరం ఎత్తు పెంపుతో భద్రాచలానికి ముంపు వస్తుందనే తెలంగాణ మంత్రుల వ్యాఖ్యలను రాజకీయ అభ్యంతరాలుగానే చూస్తామన్నారు. ఎవరు ఔనన్నా కాదన్నా పోలవరం నిర్మాణం తథ్యమని స్పష్టం చేశారు. వరద నష్టాల అంశాన్ని పార్లమెంటులోని జీరో అవర్‌, ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్రం దృష్టికి తీసుకెళతామని, కేంద్ర మంత్రులను స్వయంగా కలిసి వివరిస్తామని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. 
 
అదేసమయంలో రాష్ట్రంలో ఒక పార్టీపై మరో పార్టీ ఆధిపత్యం సాధించేందుకు రాజకీయం చేస్తూ ప్రత్యేక హోదా అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చాయన్నారు. ప్రత్యేక హోదా ఎందుకు సాధ్యం కాదో 2015లోనే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. ప్రత్యేక ఆర్థిక సహాయానికి నాటి సీఎం చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నారని, ఇప్పుడు ఆ పార్టీ ఎంపీలు మళ్లీ ప్రత్యేక హోదా అడగడం ఏమిటని ఆయన నిలదీశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ.. షో మ్యాన్..మ్యాడ్ మాన్స్టర్

Shivaj :ఓవర్సీస్ ప్రీమియర్లతో సిద్ధం చేస్తున్న ధండోరా

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments