Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డిపై వేటు పడింది.. పోస్టింగ్ ఇవ్వకుండా...

Webdunia
బుధవారం, 2 జూన్ 2021 (09:21 IST)
అధికార వైకాపా నేతలకు అడుగులుమడుగులు వత్తుతున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటూ వచ్చిన గుంటూరు జిల్లా అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డిపై సీఎం జగన్ సారథ్యంలోని వైకాపా ప్రభుత్వం వేటు వేసింది. ఆయనను బదిలీ చేసింది. పైగా, ఆయనకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించింది. 
 
అదేసమయంలో ఆయన స్థానంలో గుంటూరు అర్బన్ ఎస్పీగా ఆరిఫ్ హఫీజ్‌ను నియమించారు. ఆరిఫ్ హఫీజ్ ప్రస్తుతం గుంటూరు జిల్లా రూరల్ ఎస్ఈబీలో అడిషనల్ ఎస్పీగా పనిచేస్తున్నారు.
 
ఇటీవల కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను వైకాపా రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు  కలిసి ఎస్పీ అమ్మిరెడ్డిపై ఫిర్యాదు చేయడం తెలిసిందే. తనపై ఎస్పీ అమ్మిరెడ్డి, సికింద్రాబాద్ సైనిక ఆసుపత్రి రిజిస్ట్రార్ కేపీ రెడ్డి, టీటీడీ జేఈఓ ధర్మారెడ్డి కుట్రకు తెరదీశారని రఘురామ ఆరోపించారు. 
 
అందుకు తగిన ఆధారాలను కూడా ఆయన రాజ్ నాథ్ కు సమర్పించినట్టు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో, ఎస్పీ అమ్మిరెడ్డిని గుంటూరు అర్బన్ ఎస్పీ బాధ్యతల నుంచి హఠాత్తుగా తప్పించడం చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments