Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డిపై వేటు పడింది.. పోస్టింగ్ ఇవ్వకుండా...

Webdunia
బుధవారం, 2 జూన్ 2021 (09:21 IST)
అధికార వైకాపా నేతలకు అడుగులుమడుగులు వత్తుతున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటూ వచ్చిన గుంటూరు జిల్లా అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డిపై సీఎం జగన్ సారథ్యంలోని వైకాపా ప్రభుత్వం వేటు వేసింది. ఆయనను బదిలీ చేసింది. పైగా, ఆయనకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించింది. 
 
అదేసమయంలో ఆయన స్థానంలో గుంటూరు అర్బన్ ఎస్పీగా ఆరిఫ్ హఫీజ్‌ను నియమించారు. ఆరిఫ్ హఫీజ్ ప్రస్తుతం గుంటూరు జిల్లా రూరల్ ఎస్ఈబీలో అడిషనల్ ఎస్పీగా పనిచేస్తున్నారు.
 
ఇటీవల కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను వైకాపా రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు  కలిసి ఎస్పీ అమ్మిరెడ్డిపై ఫిర్యాదు చేయడం తెలిసిందే. తనపై ఎస్పీ అమ్మిరెడ్డి, సికింద్రాబాద్ సైనిక ఆసుపత్రి రిజిస్ట్రార్ కేపీ రెడ్డి, టీటీడీ జేఈఓ ధర్మారెడ్డి కుట్రకు తెరదీశారని రఘురామ ఆరోపించారు. 
 
అందుకు తగిన ఆధారాలను కూడా ఆయన రాజ్ నాథ్ కు సమర్పించినట్టు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో, ఎస్పీ అమ్మిరెడ్డిని గుంటూరు అర్బన్ ఎస్పీ బాధ్యతల నుంచి హఠాత్తుగా తప్పించడం చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments