Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెయిర్ కంటింగ్ విషయంలో గొడవ : కత్తెరతో పొడిచి చంపిన వైనం

Webdunia
ఆదివారం, 5 సెప్టెంబరు 2021 (15:18 IST)
గుంటూరు జిల్లా పిడుగురాళ్ళలో దారుణం జరిగింది. హెయిర్‌ కటింగ్‌ విషయంలో జరిగిన గొడవ ఓ వ్యక్తి హత్యకు కారణమైంది. కత్తెరతో ఓ వ్యక్తిని పొడిచి చంపేశాడు. శనివారం రాత్రి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఆంజనేయులు అనే వ్యక్తి హెయిర్‌ కటింగ్‌ కోసం స్థానిక కనకదుర్గమ్మ గుడికి సమీపంలో ఉన్న ఓ సెలూన్‌కు వెళ్లాడు. అక్కడే ఉన్న చల్లా శ్రీనివాసరావు కటింగ్‌ సరిగా చేయించుకోరా అని ఆంజనేయులుకు చెప్పారు. 
 
దీంతో ఆంజనేయులు.. శ్రీనివాసరావును తిట్టి ఆపై చెంప మీద కొట్టాడు. దీన్ని చూసిన పక్కనే ఉన్న శ్రీనివాసరావు కుమారుడు నాగేంద్ర ‘‘మా నాన్ననే కొడతావా’’ అంటూ స్నేహితుడైన ఆంజనేయులతో గొడవపడ్డారు. 
 
ఈ ఘర్షణలో ఆంజనేయులు.. నాగేంద్రబాబు మెడపై ఎడమవైపు కత్తెరతో దాడి చేశాడు. ఘటనలో గాయపడిన నాగేంద్రబాబును పిడుగురాళ్లలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రభాకర్‌రావు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments