Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్ళయిన గంటల్లోనే రోడ్డు ప్రమాదంలో నవ వరుడు మృతి

Webdunia
ఆదివారం, 19 జూన్ 2022 (13:18 IST)
శ్రీకాళం జిల్లాలో ఓ విషాదకర ఘటన జరిగింది. వివాహమైన కొన్ని గంటల్లోనే రోడ్డు ప్రమాదంలో నవ వరుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ విషాదకర ఘటన శ్రీకాకుళం జిల్లా ఎల్.ఎన్.పేట మండలం పెద్దకొల్లి పసన ఆర్అండ్ఆర్ కాలనీలో జరిగింది. 
 
ఈ కాలనీకి చెందిన పవన్ కుమార్(20) అనే యువకుడు తాపీ మేస్త్రీగా పని చేస్తున్నాడు. ఈ యువకుడికి స్థానికంగా ఉండే యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఆరు నెలల క్రితం పెద్దలను ఎదిరించి ఆమెను పెళ్లి చేసుకుని, తన గ్రామానికీ తీసుకొచ్చాడు. ఆ తర్వాత వారిద్దరూ కలిసే ఉంటున్నారు. ఈ క్రమంలో ఇరు కుటుంబాల పెద్దలు రాజీకి వచ్చి వారిద్దరికి పెళ్లి చేయాలని నిర్ణయించారు. దీంతో ఈ నెల 17వ తేదీన స్వగ్రామంలో పెళ్లి జరిపించారు. 
 
పెళ్ళి తర్వాత వధువుతో పాటు మిగిలిన కుటుంబ సభ్యులంతా బస్సులో సొంత గ్రామానికి బయలుదేరారు. కానీ, వరుడు పవన్ కుమార్ తన మేనమామ బలగం సోమేశ్వర రావుతో కలిసి బైకులో గ్రామానికి వెళుతుండగా, ఎచ్చెర్ల మండలం అరిణాం అక్కివలస సమీపంలో పెట్రోల్ బంకు వద్ద వీరి బైకను వెనుక నుంచి వచ్చిన కంటైనర్ లారీ ఢీకొట్టింది. 
 
ఈ ప్రమాదంలో వీరిద్దరూ గాయపడ్డారు. దీంతో హుటాహుటిన 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. పెళ్లయిన గంటల వ్యవధిలోనే వరుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

Samantha: రామ్ చరణ్, కార్తీతో సమంత స్పెషల్ సాంగ్ చేస్తుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments