పెళ్ళయిన గంటల్లోనే రోడ్డు ప్రమాదంలో నవ వరుడు మృతి

Webdunia
ఆదివారం, 19 జూన్ 2022 (13:18 IST)
శ్రీకాళం జిల్లాలో ఓ విషాదకర ఘటన జరిగింది. వివాహమైన కొన్ని గంటల్లోనే రోడ్డు ప్రమాదంలో నవ వరుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ విషాదకర ఘటన శ్రీకాకుళం జిల్లా ఎల్.ఎన్.పేట మండలం పెద్దకొల్లి పసన ఆర్అండ్ఆర్ కాలనీలో జరిగింది. 
 
ఈ కాలనీకి చెందిన పవన్ కుమార్(20) అనే యువకుడు తాపీ మేస్త్రీగా పని చేస్తున్నాడు. ఈ యువకుడికి స్థానికంగా ఉండే యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఆరు నెలల క్రితం పెద్దలను ఎదిరించి ఆమెను పెళ్లి చేసుకుని, తన గ్రామానికీ తీసుకొచ్చాడు. ఆ తర్వాత వారిద్దరూ కలిసే ఉంటున్నారు. ఈ క్రమంలో ఇరు కుటుంబాల పెద్దలు రాజీకి వచ్చి వారిద్దరికి పెళ్లి చేయాలని నిర్ణయించారు. దీంతో ఈ నెల 17వ తేదీన స్వగ్రామంలో పెళ్లి జరిపించారు. 
 
పెళ్ళి తర్వాత వధువుతో పాటు మిగిలిన కుటుంబ సభ్యులంతా బస్సులో సొంత గ్రామానికి బయలుదేరారు. కానీ, వరుడు పవన్ కుమార్ తన మేనమామ బలగం సోమేశ్వర రావుతో కలిసి బైకులో గ్రామానికి వెళుతుండగా, ఎచ్చెర్ల మండలం అరిణాం అక్కివలస సమీపంలో పెట్రోల్ బంకు వద్ద వీరి బైకను వెనుక నుంచి వచ్చిన కంటైనర్ లారీ ఢీకొట్టింది. 
 
ఈ ప్రమాదంలో వీరిద్దరూ గాయపడ్డారు. దీంతో హుటాహుటిన 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. పెళ్లయిన గంటల వ్యవధిలోనే వరుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shiv Rajkumar: ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌‌లో నటించేందుకు సిద్ధం

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments